నాగార్జున హీరోగా దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్న సినిమా మన్మధుడు -2. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి . మన్మధుడు వంటి సినిమా కు సీక్వెల్ దర్శకుడు రాహుల్ రూపొందిస్తోన్న ఈ చిత్రం లో నాగార్జున ఎలా కన్పిస్తారోనన్న ఉత్కంఠ సగటు ప్రేక్షకుల్లో నెలకొంది . 60 ఏళ్ల వయస్సులోనూ హీరో నాగార్జున అచ్చం మన్మధుడులా కనిపించడంతో ఈ సినిమాపై ఇప్పటివరకు అంచనాలు రెట్టింపు అయ్యాయి .
తెలుగులో ఇప్పటి వరకూ సీక్వెల్ సినిమా హిట్ కాకపోయినా, మన్మధుడు-2 చిత్రం ఆ ట్రెండ్ మారుస్తుందని హీరో నాగార్జున ధీమాగా ఉన్నాడు . మన్మథుడు -2 సినిమా టీజర్ రిలీజ్ అయిన వెంటనే ఈ చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ చూసి మేకర్స్ హ్యాపీ అవుతున్నారు .డిజిటల్ రైట్స్ కోసం ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ప్లిక్స్ ఏకంగా 7. 4 కోట్లు వెచ్చిండింది . ఇక తెలుగు , హిందీ శాటిలైట్ హక్కుల రూపంలో నే మన్మధుడు-2 సినిమా కి 22 కోట్ల రూపాయల వరకూ దక్కే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది .
మన్మధుడు-2 చిత్రాన్ని మనం ఎంటర్ ప్రజెస్ , ఆ నంది ఆర్ట్స్ , వయాకామ్ 18 స్టూడియోస్ పతాకంపై నాగార్జున అక్కినేని, కిరణ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆగస్టు 9న ఈ చిత్రం రిలీజ్ కానుంది. నాగార్జున సరసన ఈ చిత్రం లో రకుల్ ప్రీత్ సింగ్ , కీర్తి సురేష్ లు హీరోయిన్లుగా నటిస్తుండగా , సమంత ఒక కీలకపాత్ర పోషిస్తోంది .