ఒకప్పటి టాప్ హీరోయిన్లు ప్రస్తుతం సీనియర్ హీరోయిన్లుగా మారిపోయారు. వాళ్లిద్దరే త్రిష, సిమ్రాన్. సిమ్రాన్ సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగిస్తోంది. త్రిష మాత్రం తన అందానికి వన్నె తెచ్చుకుంటూ మంచి మంచి సినిమాలు నటించుకుంటూ పోతోంది. తాజాగా త్రిష నటించిన 96 సూపర్ హిట్ టాక్‌ను సంపాదించిపెట్టింది. అలాగే సిమ్రాన్-త్రిష కాంబోలో సూపర్ స్టార్ రజనీకాంత్ పేట సినిమా తెరకెక్కింది. 
 
ఈ సినిమాలో ఇద్దరి నటనకు మంచి మార్కులే పడ్డాయి. తాజాగా వీరిద్దరూ మళ్లీ కలిసి నటించబోతున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్‌ గా మారింది. సుమంత్ రామకృష్ణన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రంలో సతీష్, జగపతిబాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి షుగర్ (sugar) అనే టైటిల్‌ను ఖాయం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.


ఈ వార్త ని కంఫర్మ్ చెయ్యడానికి ప్రొడ్యూసర్లకి టైం పట్టచెమోగాని, ఇద్దరి హీరోయిన్ అభిమానులకి ఈ వార్త వినడానికే హాయినిస్తోంది. ఒకప్పుడు సెక్సీ బ్యూటీస్ గా ఉన్న వీళ్ళు, ఇప్పుడు ఎలాంటి కథతో అభిమానులని అక్కటుకుంటారో వేచి చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: