రంగస్థలం సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు సుకుమార్. రంగస్థలం విడుదలై ఇప్పటికే సంవత్సరం గడిచిపోయింది. అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో సినిమా మొదలవాల్సి ఉన్నా ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళడానికి ఇంకా ఎంత సమయం పడుతుందో చెప్పలేము. ప్రస్తుతం అల్లుఅర్జున్ త్రివిక్రమ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత వేణు శ్రీరామ్ దిల్ రాజు కాంబినేషన్లో సినిమా మొదలవుతుంది. ఈ రెండు సినిమాలు పూర్తయ్యాక సుకుమార్ అల్లుఅర్జున్ సినిమా మొదలు కాబోతుంది. 
 
నిజానికి మహర్షి సినిమా తరువాత మహేశ్ బాబు సుకుమార్ కాంబోలో సినిమా ఓకె అయింది. కానీ మహేశ్ బాబుకు అనిల్ రావిపూడి చెప్పిన కథ నచ్చడంతో రెండు సినిమాలకు ఒకేసారి డేట్స్ ఇస్తానన్నాడు మహేశ్ బాబు. సుకుమార్ ఇదే సమయంలో అల్లు అర్జున్ కు కథ చెప్పి ఓకె చేయించుకోవటంతో మహేశ్ బాబు కొన్ని కారణాల వలన సుకుమార్ తో సినిమా ఆగిపోయిందని, సుకుమార్ 1 నేనొక్కడినే లాంటి క్లాసిక్ మూవీ ఇచ్చాడని ఈ సినిమా షూటింగ్ టైమ్లో చాలా ఎంజాయ్ చేసానని మహేశ్ బాబు ట్వీట్ చేసాడు. 
 
ఇలా మహేశ్ బాబు మూవీ ఆగిపోవడం, అల్లు అర్జున్తో సినిమా ఓకె అయినా రెండు సంవత్సరాలు ఎదురు చూడాల్సి రావటం వలన సుకుమార్ కెరీర్లో భారీగా గ్యాప్ వస్తుంది. సుకుమార్ అల్లు అర్జున్ సినిమా 2020లో మొదలైనా ఆ సినిమా రిలీజ్ అవడానికి 2021దాకా వేచి ఉండాల్సిందే. సుకుమార్ మహేశ్ చెప్పినట్లు చేసి ఉంటే మాత్రం సుకుమార్ సినిమా ఈ పాటికే షూటింగ్ మొదలై ఉండేది.రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ తరువాత సినిమాల విషయంలో ప్లానింగ్ లేక సుకుమార్ తప్పు చేసాడని వార్తలు వినిపిస్తున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: