'నీది నాది ఒకే కథ' సినిమాతో  విజయాన్ని అందుకున్నాడు డైరెక్టర్ 'వేణు ఉడుగుల', కాగా ఈ దర్శకుడు తన రెండో సినిమాగా  రానా, సాయిప‌ల్ల‌విలను   హీరోహరోయిన్లుగా  పెట్టి   'విరాట పర్వం`  అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న  విషయం తెలిసిందే. తెలంగాణ ప్రాంతంలోని  1990 నాటి సామాజిక పరిస్థితుల ఆధారంగా  పీరియాడిక్ సోషల్ డ్రామాగా  ఈ మూవీ రానుంది.  కాగా  ఈ సినిమా ఇప్పటికే మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. 


కొన్ని రోజుల క్రితం తెలంగాణలోని ధరిపల్లి అనే గ్రామంలో  ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది.  ప్రస్తుతం ఈ సినిమా రెండో షెడ్యూల్  శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీత దర్శకుడు.  ఈ సినిమాలో  ఓ కీల‌క‌మైన పాత్ర‌లో ట‌బు నటిస్తోంది.  ఇక ఈ సినిమాను హిందీ, తమిళ భాష‌ల్లోనూ విడుద‌ల చేస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: