ఆ మద్య టాలీవుడ్ లో వచ్చిన ఆనందం మూవీతో పరిచయం అయిన హీరో ఆకాష్ ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించారు. ‘ఆనందం’ మూవీకి దేవీశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఇప్పటికీ మర్చిపోలని విధంగా ఉంటుంది. ఆకాష్ తెలుగు, తమిళ మూవీస్ లో నటించారు. తెలుగులో సరైన అవకాశాలు రాక కొంత కాలంగా సినీ పరిశ్రమకు దూరంగా ఉంటున్నారు. తాజాగా ఇస్మార్ట్ శంకర్ మూవీ విషయంలో తెరపైకి వచ్చాడు ఆకాష్.
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’మూవీ మంచి హిట్ సాధించి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లే రాబడుతుంది. కొత్తతరం ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండడంతో కోట్లు కొల్లగొడుతున్న 'ఇస్మార్ట్ శంకర్'. అయితే ఈ మూవీ అసలు కాన్సెప్ట్ తనదే అని ఒక వ్యక్తి మెదడును హీరోకి మార్పిడి చేయడమనే మూల కథతో 'ఇస్మార్ట్ శంకర్' రూపొందింది.
ఇదే కాన్సెప్ట్ తో తెలుగు-తమిళ భాషల్లో తను తయారు చేసిన కథ, కథనాలతో తననే హీరోగా పెట్టి రాధ అనే మహిళా దర్శకురాలు ఒక సినిమా తీశారని, అది తమిళంలో ‘నాన్ యార్’ అనే పేరుతొ విడుదల కాగా, తెలుగులో ‘కొత్తగా ఉన్నాడు’ టైటిల్తో త్వరలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఈ మూవీని తెలుగులో ‘కొత్తగా ఉన్నాడు’ టైటిల్తో త్వరలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఇదే కాన్సెప్ట్ తో ఇప్పుడు ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీ రావడం షాక్ కి గురి చేసిందన్నారు.
అయితే ఈ విషయంపై పూరి జగన్నాథ్ ని కలిసి మాట్లాడానుకున్నా ఆయన కలవలేకపోయానని అందుకే తమిళ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఫిర్యాదు చేసి.. సత్వర పరిష్కారం కోసం ఇక్కడ మీడియాను ఆశ్రయించామని తెలిపారు. తన వాదనను బలపరిచే ఆధారాలను ఆకాష్ మీడియా ముందు ఉంచారు. ఈ విషయంలో తనకు న్యాయం జరిగేలా లీగల్గా ప్రొసీడ్ అయ్యేందుకు కూడా తానూ సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు.