ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ లో రాంచరణ్ తో కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా అన్ని సినిమా ఇండస్ట్రీల్లోనూ ఎంతో క్రేజ్ ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది జులై 30న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ అల్లూరిగా నటిస్తుంటే, ఎన్టీఆర్ ఇందులో కొమరం భీంగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం హీరోలిద్దరూ కూడా వచ్చే ఏడాది మే వరకు తమ డేట్స్ కేటాయించినట్లు సమాచారం. అయితే మధ్య మధ్యలో తమ తదుపరి సినిమాలకు సంబంధించి ఈ ఇద్దరూ తమ వద్దకు వచ్చిన దర్శకుల నుండి కథలు వింటున్నారట. 

అయితే అందులో ఎన్టీఆర్ ఇప్పటికే కెజిఎఫ్ దర్శకుడైన ప్రశాంత్ నీల్ ను లైన్ లో పెట్టినట్లు ఫిలిం నగర్ వర్గాల నుండి గట్టిగానే వార్తలు వస్తున్నాయి. ఇక ఇటీవల మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరు ఈ విషయమై నిజమేనని స్పందించడంతో, ఎన్టీఆర్ ఫ్యాన్స్ తమ హీరోకు మరొక మంచి మాస్ హిట్ రాబోతోందని అప్పుడే సంబరాలు మొదలెట్టేసాడు. అయితే ఈ సినిమా కథ ఇప్పటికే పూర్తి కావచ్చిందని, అలానే ఈ సినిమాలో అయన సరసన హీరోయిన్ గా సాయి పల్లవిని తీసుకోవాలని దర్శకుడు ప్రశాంత్ ఆల్మోస్ట్ నిర్ణయించినట్లు సమాచారం. ఇక మరికొద్దిరోజుల్లో పూర్తి కథ సిద్ధం అయిన తరువాత దానిని ఎన్టీఆర్ కు వినిపించి, ఆపై సాయిపల్లవి సెలెక్షన్ విషయమై కూడా మాట్లాడనున్నాడట. తాను రాసుకున్న కథలోని హీరోయిన్ పాత్రకు సాయిపల్లవి అయితేనే కరెక్ట్ గా న్యాయం చేయగలదని భావించిన దర్శకుడు ప్రశాంత్, ఈ నిర్ణయానికి వచ్చినట్లు చెప్తున్నారు. 

వాస్తవానికి కొద్దిరోజుల క్రితం, ఆర్ఆర్ఆర్ మూవీలో ఎన్టీఆర్ ప్రక్కన హీరోయిన్ కోసం వెతుకులాట ప్రారంభించిన ఆ సినిమా యూనిట్, సాయిపల్లవిని ఫైనల్ చేసారని వార్తలు వచ్చాయి. అయితే దానిపై ఇప్పటివరకు ఎటువంటి సమాచారం లేదు. అయితే ఆ సినిమాలో కాకుండా రాబోయే ప్రశాంత్ నీల్ సినిమా కోసం ఆమెను సెలెక్ట్ చేయడం నిజమే అంటున్నారు. మరి ఇందులో వాస్తవం ఎంతవరకు ఉందొ తెలియదుగాని, కొందరు సినీ విశ్లేషకులు మాత్రం త్వరలో సాయిపల్లవి, ఎన్టీఆర్ తో జోడి కట్టే అవకాశం కూడా లేకపోలేదని చిన్న హింట్ ఇస్తున్నారు. మరి ఇందులో నిజానిజాలు తెలియాలంటే మాత్రం మరికొద్దిరోజులు ఆగాల్సిందే....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: