సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తోన్న 'సరిలేరు నీకెవ్వరు' ఇటివలే కాశ్మీర్ లో ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంది. ఈ కాశ్మీర్ షెడ్యూల్ లో మహేష్ తో పాటు రాజేంద్ర ప్రసాద్ అలాగే కొంతమంది ముఖ్య తారాగణం కూడా పాల్గొన్నారు. ఈ షెడ్యూల్ లో మహేష్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించే సన్నివేశాలనే మాత్రామే షూట్ చేశారు. కాగా ఈ సినిమాలో మహేష్ బాబు లుక్ సినిమా మొత్తం ఒకటే ఉంటుందట. మహర్షిలో మహేష్ బాబు మూడు లుక్స్ లో కనిపించిన విషయం తెలిసిందే.
అయితే 'సరిలేరు నీకెవ్వరు'లో మాత్రం మహేష్ గెటప్ మారినా లుక్ మాత్రం మారదట. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా విడుదలకు ముందే రికార్డ్ స్థాయిలో శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోయాయి. ఇక ఈ సినిమాలో మహేశ్ సరసన రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఒక్కప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే జగపతి బాబు కూడా మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు తో కలిసి అనిల్ సుంకర నిర్మించనున్నారు.