ఒక ప్రముఖ ఛానెళ్ళో తీన్మార్ వార్తలు అనే ప్రోగ్రామ్ ద్వారా ఫేమస్ అయింది శివజ్యోతి. శివజ్యోతి అంటే ఎవరూ గుర్తు పట్టరేమో కానీ తీన్మార్ సావిత్రి అంటే మాత్రం అందరూ గుర్తు పడతారు.శివజ్యోతికి అంతలా ఆ ప్రోగ్రామ్ ద్వారా పాపులారిటీ వచ్చింది . శివజ్యోతి(సావిత్రి), బిత్తిరి సత్తి ఇద్దరూ కలిసే చేసే తీన్మార్ వార్తలు అనే ప్రోగ్రామ్ఆ ఛానెల్లో ఇతర ప్రోగ్రామ్స్ కంటే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. కానీ బిగ్ బాస్ షోలో అవకాశం రావటంతో ఆ ఛానెల్ ను మూడు నెలల పాటు సెలవు అడిగింది శివజ్యోతి. 
 
కానీ ఆ ఛానెల్ అందుకు సమ్మతించకపోవడంతో తన ఉద్యోగానికే రాజీనామా చేసింది. ఇదే సమయంలో ఆ ఛానెల్ తమ ఛానెల్ ద్వారా వచ్చిన పేరును ఎక్కడా వాడకూడదని షరతు విధించారట. అందుకే నిన్న ప్రసారమైన బిగ్ బాస్ షోలో హోస్ట్ నాగార్జున శివజ్యోతి అనే పేరుతోనే పరిచయం చేసాడు. నాగార్జున ఎక్కడా కూడా సావిత్రి అనే పేరును ఉపయోగించలేదు. కానీ ఇదే షోలో పాల్గొంటున్న జాఫర్ మాత్రం మూడు నెలల సెలవు తీసుకుని వచ్చినట్లు తెలుస్తుంది. 
 
నిన్న ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 3 మొదటి ఎపిసోడ్ ప్రేక్షకుల్ని చాలా ఆకట్టుకుంది. శివజ్యోతి ట్రంక్ పెట్టెతో షోలో అడుగుపెట్టటం, బిగ్ బాస్ షోలో మంచీ చెడుఙాపకాల్ని ట్రంక్ పెట్టెలో పెట్టి తీసుకెళ్తానని చెప్పటం ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. గత సీజన్లతో పోలిస్తే ఈసారి అందరూ తెలిసిన సెలబ్రిటీలే ఉండటంతో టీవీ వీక్షకులు ఈ షోపై ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: