యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా సాహో. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ద కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. దాదాపు 250 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను భారీ  రేంజ్ లోనే ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయాడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నారు. అంతే కాదు ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ భాషల్లోను ఒకేసారి రిలీజ్ చేయనున్నారట. అయితే ఇప్పటికే చాలా ఆలస్యం అయినా ఈ సినిమా ఆగస్ట్ 15 న విడుదల చేయాలని పక్కా ప్లాన్ చేశారట నిర్మాతలు. కానీ రీసెంట్‌గా ఆ డేట్ కి ప్రేక్షకుల ముందుకు రావడం లేదని ప్రభాస్ ఫ్యాన్స్ కి నిర్మాతలు పెద్ద షాకిచ్చారు. 

ఇలా చెప్పారో లేదో రణరంగం తో మరో సినిమాను ఆగస్ట్ 15 న విడుదల చేస్తున్నట్లు ఆయా చిత్ర నిర్మాతలు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అయితే యు.వి సంస్థ వాళ్ళు సాహోని ఆగస్ట్ 30 న గ్రాండ్ గా ప్రపంచ స్థాయిలో విడుదల చేస్తున్నామని మళ్ళీ అఫీషియల్ గా డేట్ ని అనౌన్స్ చేశారు. అయితే ఈ డేట్ కి సాహో రావడం డౌటే అంటున్నారు సినీ వర్గాలు. అందుకు కారణం ఇంకా ఈ సినిమాకి సంబంధించి గ్రాఫిక్స్ వర్క్ కంప్లీట్ అవలేదట. అందుకే రిలీజ్ డేట్ మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యో అవకాశాలున్నాయని టాక్. మరి ప్రభాస్ చొరవ తీసుకొని ఈసారైనా పక్కా అనుకున్న డేట్ కి రిలీజ్ చేస్తే అన్ని విధాలా బావుంటుంది. లేదంటే అనవసరంగా నెగిటివ్ పబ్లిసిటి అయ్యో ఛాన్స్ లేకపోలేదు. 

దానికి తోడు సాహో కి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ప్రమోషన్స్ కార్యక్రమాలను మొదలు పెట్టకపోవడం కూడా ఫ్యాన్స్ ని నిరుత్సాహపరచినట్టవుతుంది. ఆ మధ్య ఒక సాంగ్ ప్రోమో ని రిలీజ్ చేస్తే అది ఏమాత్రం ఫ్యాన్స్ ని ఆకట్టుకోలేకపోయింది. మరి ఈసారి రిలీజ్ చేసే సాంగ్ కాని, ట్రైలర్ కానీ సినిమాపై భారీగా అంచనాలను పెంచేలా ఉంటే బావుంటుంది. ఇకపోతే సాహో లాంటి భారీ ప్రాజెక్ట్ ని హ్యాండిల్ చేయలేకపోతున్నారు నిర్మాతలు అన్న కామెంట్స్ కూడా లోలోపల అనుకుంటున్నారట సినీ వర్గాలు.  



మరింత సమాచారం తెలుసుకోండి: