మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా సైరా నరసింహా రెడ్డి. నయనతార, తమన్నా భాటియా, బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, సుదీప్..తదితరులు నటిస్తున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ బ్యానర్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. దాదాపు రెండేళ్ళు ఎంతో కష్టపడి నిర్మిస్తున్న ఈ సినిమాను బాహుబలి సినిమాతో పోలుస్తున్నారు. ఇక ఈ సినిమా అంటే మెగా అభిమానులకు ఒక పండగా లాంటిదే అని చెప్పాలి. 

కానీ ఇంత భారీ ప్రాజెక్ట్ ఎప్పటికప్పుడు రిలీజ్ డేట్ వాయిదా పడుతుండడంతో మెగా ఫ్యాన్స్ కి కొంత నిరాశ తప్పడంలేదు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ సినిమాను అక్టోబర్ 2 న గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి నిర్మాత రామ్ చరణ్ మాత్రం ఎంతో శ్రమిస్తున్నారని ఇన్‌సైడ్ టాక్. ప్రేక్షకుల అంచనాలు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాను అన్నీ విషయాల్లో జాగ్రత్త వహిస్తున్నట్లు సమాచారం. బయట ఎన్ని పుకార్లు వస్తున్నప్పటికి చరణ్ మాత్రం సైలెంట్ గా సైరా విషయంలో తన పని తాను చేసుకుంటూ వెళుతున్నట్లు ఫిల్మ్ నగర్ సమాచారం. 

అయితే ఫ్యాన్స్ కి మాత్రం ఆగస్ట్ 15  పెద్ద ట్రీటే ఇవ్వబోతున్నారని లేటెస్ట్ న్యూస్. అది ట్రైలరా..లేదా సాంగ్ ప్రోమోనా అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంది. ఇక ఈ సినిమా విడుదలలో జాప్యం అవడానికి మాత్రం అసలు కారణం గ్రాఫిక్స్ వర్క్ అని తెలుస్తోంది. ఈ సినిమాలో అధిరిపోయో విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయని చిత్ర బృందం ముందు నుంచే చెపుతున్నారన్న సంగతి తెలిసిందే. ఈ వర్క్ విషయంలోనే సైరా లేట్ అవుతోందట. మరి అక్టోబర్ 2న అయినా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారా లేదా అన్నది చిత్ర బృందం నుండి ఏదైనా అఫీషియల్ గా చెప్తేగానీ తెలీదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: