చియాన్ విక్రమ్ ఒకప్పుడు స్టార్ హీరో. తన సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఎదురు చూసేవారు. ఒకదశలో అతడ్ని పరభాషా నటుడిగా కూడా చూడలేదు తెలుగు ప్రేక్షకులు. అలా తన నటనతో, మంచి కథలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న విక్రమ్, ఇప్పుడు టాలీవుడ్ కు పూర్తిగా దూరమయ్యాడు. అతడి సినిమాల్ని ఇప్పుడిక్కడ పట్టించుకునే పరిస్థితి అసలు లేనే లేదు. రీసెంట్ గా విక్రమ్ నటించిన మిస్టర్ కెకె సినిమా థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమా వచ్చిన విషయాన్ని కూడా జనాలు పట్టించుకోలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. 

మరీ బాధాకరమైన విషయం ఏంటంటే.. ఈ సినిమాకి ఒకరోజు ముందు రిలీజైన ఇస్మార్ట్ శంకర్ ఈ సినిమా దెబ్బకు వీకెండ్ పూర్తయ్యేవరకు కూడా థియేటర్లలో ఉంచలేదు.హైదరాబాద్ తో పాటు ఆంధ్రలోని చాలా పట్టణాల్లో మిస్టర్ కెకె సినిమాను ఎత్తేశారు. ఆ స్థానంలో ఇస్మార్ట్ శంకర్, ఓ బేబీ సినిమాల్ని ఆడిస్తున్నారు. అలా శుక్రవారం రిలీజైన ఈ సినిమా చాలా సెంటర్లలో శనివారానికే దుకాణం సర్దేసింది.

నిజానికి మిస్టర్ కెకె సినిమాలో విషయం కూడా లేదని సినిమా చూసిన చాలామంది అభిప్రాయం. యాక్షన్ థ్రిల్లర్ సబ్జెక్ట్ తో వచ్చిన ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాల్ని వెదుక్కోవాల్సి వచ్చిందట. దీనికితోడు విక్రమ్ గెటప్ కూడా ఆడియన్స్ కు ఎక్కలేదు. కమర్షియల్ ఫార్మాట్ కు దూరంగా ఉండడం, యాక్షన్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడంతో మిస్టర్ కెకె సినిమా వీకెండ్ కూడా కంప్లీట్ కాకుండానే సర్దుకుంది.  ఒకవైపు కొడుకు నటించిన సినిమా పరిస్థితి తెలిసిందే. ఇప్పుడు తండ్రి సినిమా ఇలా అయిపోయింది. మరి నెక్స్ట్ ప్లాన్స్ ఎలా చేయాలనుకుంటున్నాడో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: