శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన "హ్యాపీ డేస్" సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నటుడు "నిఖిల్" ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినప్పటికీ అవి పెద్దగా గుర్తింపు తీసుకు రాలేదు. "స్వామి రారా" సినిమా విజయంతో సక్సెస్ ట్రాక్ లో పడ్డాడు. అలా వరుసగా వైవిధ్యమైన కథలని ఎంచుకుంటూ "కార్తికేయ", "ఎక్కడికి పోతావు చిన్నవాడా" సినిమాలతో విజయాల బాట పట్టాడు.


అయితే నిఖిల్ నటించిన కొత్త చిత్రం "అర్జున్ సురవరం". ఈ సినిమా స్టార్ట్ చేసినప్పటినుండి వివాదాలే. ముందుగా ఈ సినిమాకి "ముద్ర" అనే టైటిల్ సన్ఫర్మ్ చేశారు. కానీ ఆ టైటిల్ వేరే వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు అని తేలడంతో "అర్జున్ సురవరం" గా మార్చారు. ఈ సినిమాలో జర్నలిస్ట్ పాత్రలో నిఖిల్ కనిపించనున్నాడు. ఈ సినిమా విడుదల తేదీని పలు మార్లు మార్చారు. మొదటగా మే 1వ తేదీకి వస్తుందని చెప్పారు.


కానీ పరిస్థితులు అనుకూలించకపోవడంతో విడుదల తేదీ మార్చారు. మళ్ళీ ఈ సినిమా ఎప్పుడు వస్తుందనేది ఇంత వరకు చెప్పలేదు. అయితే తాజాగా ఈ సినిమా విడుదలని ఉద్దేశిస్తూ "ఒక్కోసారి మనం స్వఛ్ఛంగా బయటకు రావాలంటే మంటల్లో మండాల్సి ఉంటుంది" అని ట్వీట్ చేసాడు. దాంతో పాటు సినిమా స్టిల్ ని కూడా యాడ్ చేసాడు.


ఈ స్టేట్ మెంట్ చూస్తుంటే ఈ సినిమా సమస్యల పరిష్కారానికి ఇంకా సమయం పట్టేలా ఉందని అర్థమవుతుంది. మరి ఆ సమస్యలు తీరి సినిమా ఎప్పుడు బయటకు వస్తుందో చూడాలి. ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.టి.సంతోష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బి.మధు సమర్పణలో మూవీ డైనమిక్స్ ఎల్ఎల్‌పీ, ఔరా సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై రాజ్ కుమార్ ఆకెళ్ల, కావ్య వేణుగోపాల్ నిర్మించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: