దర్శకుడు పూరి జగన్నాథ్ - ఎనర్జిటిక్ హీరో రామ్ కాంబినేషన్ లో వచ్చిన "ఇస్మార్ట్ శంకర్" బాక్సాఫీసు వద్ద దుమ్ము దులుపుతుంది. చాలా రోజుల తర్వాత వచ్చిన మాస్ సినిమా కావడంతో హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఈ సక్సెస్ సంబరాల్లో రామ్ గోపాల్ వర్మ ఎంత రచ్చ చేసాడో అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరించిన పూరి- ఛార్మి ల మధ్య ఏవేవో వార్తలు వస్తున్నాయి.


వీరిద్దరి మధ్య అనవసర లింకులు పెట్టి భయంకరమైన గాసిప్ లు వస్తున్నాయి. ఇస్మార్ట్ శంకర్ షూటింగ్ సమయంలో పూరి, ఛార్మీల మధ్య గొడవ జరిగింది. దాని భరించలేక హీరో రామ్ విదేశాలకి చెక్కేశారు. అంతేకాదు.. ఇస్మార్ట్ శంకర్ సినిమాకు గానూ హీరో రామ్ కి సగం పారితోషికం మాత్రమే ఇచ్చారు. సంగీత దర్శకుడు మణిశర్మకి ఇంకా పూర్తి పారితోషికం ముట్టలేదని ఓ మీడియా కథనం రాసింది.


అందుకే రామ్ సినిమా రిలీజ్ అవ్వకముందే  అమెరికా వెళ్ళిపోయాడని రాసుకొచ్చింది. తాజాగా దీనిపై రామ్ స్పందించారు. ఈ ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. ‘ఈ వార్త చూసి పడిపడి నవ్వుకున్నా. ఇలాంటి తప్పుడు వార్తలకు సాధారణంగా నేను స్పందించను. కానీ, ఈ వదంతు మాత్రం సూపర్‌. ‘బంగారం అండీ వీళ్లు..’’ అంటూ పూరీ, ఛార్మిని ట్యాగ్‌ చేశారు.

అయితే ఈ విషయంపై పూరి కానీ, ఛార్మి కానీ స్పందించలేదు. రామ్ స్పందనతో ఈ గొడవ సద్దుమణిగిందనే అనుకోవచ్చు. ఏది ఏమైనా ఇస్మార్ట్ శంకర్ విజయం రామ్ కెరీర్లో గుర్తుండి పోయేలా నిలిచింది. అప్పటి వరకు గుడ్ బాయ్ గా కనిపించిన రామ్ బ్యాడ్ బాయ్ గా యాక్టింగ్ అదరగొట్టాడు. ఎట్టకేలకు మంచి విజయం లభించింది.



మరింత సమాచారం తెలుసుకోండి: