యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడుగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం 'సాహో'. రాజమౌళి బాహుబలి అంతటి సూపర్ హిట్ చిత్రం తర్వాత వస్తున్న ప్రభాస్ భారీ బడ్జెట్ చిత్రం సాహూ. రెండు సంవత్సరాలకుపైగా చిత్రీకరణ చేసుకున్న సాహూ చిత్రం ఈ మధ్యనే విడుదల తేదీ ఆగష్టు 15న అని స్వతంత్ర దినోత్సవం సందర్బంగా ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రం వస్తుందని చిత్ర యూనిట్ తెలిపింది. 


కానీ అనుకోని రీతిలో ప్రభాస్ అభిమానులకు షాక్ ఇస్తూ వాయిదా పడింది. ఆగష్టు 15న విడుదల అవ్వాల్సిన చిత్రం ఆగష్టు 30కి వాయిదా పడింది. దీంతో ప్రభాస్ అభిమానులు నిరాశకి గురై ఇప్పట్లో ఈ సినిమా విడుదల కాదులే అని అనుకున్నారు. కానీ వారిలో సినిమాపై ఆసక్తి పెంచాలని ప్రభాస్ తన ఇంస్టాగ్రామ్ ద్వారా ఓ పోస్ట్ విడుదల చేసి సర్ప్రైజ్ ఇచ్చారు. ఆ సర్ప్రైజ్ ఏంటంటే ... 


సాహూ లో ప్రభాస్, శ్రద్ధ కపూర్ కి సంబంధించి ఒక పోస్టర్ ని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఆ పోస్టర్ పోస్ట్ చేస్తూ 'డార్లింగ్స్, మిమ్మల్ని కలవడానికి ఆగష్టు 30న మేము వచేస్తున్నాం. బి రెడీ' అంటూ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ చుసిన అభిమానులు సర్ప్రైజ్ అయ్యారు. సాహూ ఎప్పుడు విడుదల అవుతుందా? ఎప్పుడు చూస్తామా అని వెయిట్ చేస్తున్నాం అంటూ కామెంట్ బాక్స్ బద్దలు కొడుతున్నారు. కాగా ఈ సినిమా యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై సుజీత్ దర్శకత్వంలో దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్‌తో సాహూ సినిమా రూపొందుతోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: