ఎంతో మంది సినిమా అభిమనులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న చిత్రం "సాహో". బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన చిత్రం "సాహో". బాహుబలితో ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ "సాహో" లాంటి భారీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ఈ మధ్యే టీజర్ రీలీజ్ అయిన ఈ చిత్రం నుండి మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ బయటకు వచ్చింది.


టీజర్ రిలీజ్ చేసి హైప్ పెంచిన చిత్ర బృందం ఇప్పుడు మరింత ఆసక్తికరంగా ఒక పోస్టర్ ని రిలీజ్ చేసింది. టీజర్ కి చాలా మంచి స్పందన వచ్చింది. అలాగే మొన్న వచ్చిన సైకో సయ్యాన్ పాట కూడా ఆకట్టుకుంది. సినిమా విడుదల వాయిదా వేసామని అభిమానులని నిరాశపరిచిన యువి క్రియేషన్స్ ఇప్పుడు పోస్టర్ రిలీజ్ చేసి అభిమానుల్లో ఉన్న నిరాశని తీర్చిందనే చెప్పాలి.


ప్రభాస్, శ్రద్ధాకపూర్ లు ఉన్న ఈ పోస్టర్ చాలా కొత్తగా ఉంది. ఈ పోస్టర్ తో సాహో ప్రమేషన్స్ స్టార్ట్ అయ్యాయని చెప్పవచ్చు. ఇప్పటి నుండి రిలీజ్ అయ్యే వరకు మరిన్ని అప్ డేట్స్ అందిస్తూనే ఉంటుందని అర్థమవుతుంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటులు కూడా చేస్తున్నారు. బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ ప్రతినాయకుడిగా కనిపిస్తున్నారు.


అలాగే జాకీష్రాఫ్, మందిరా బేడి లాంటి నటులు ఉన్నారు. ఈ సినిమాకి నేపథ్య సంగీతం జిబ్రాన్ అందిస్తుండగా, మొన్న విడుదలయిన సైకో సయ్యాన్ పాటకి తనీష్ బగ్చీ సంగీతం అందించగ మిగతా పాటలకి ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది. యువి క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మితమవుతున్న ఈ చిత్రానికి "రన్ రాజా రన్" ఫేమ్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆగస్టు ౩౦ న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: