యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'సాహో' టీమ్‌లో అక్కినేని నాగార్జున మనుషులు ఉన్నారా..? ప్రతిష్టాత్మక సినిమా వాయిదా పడుతుందని వాళ్లు చెప్పబట్టే తన కొత్త చిత్రం రిలీజ్‌ డేట్‌ను ఫిక్స్ చేశాడా..? అంటే అవుననే ప్రచారం జరుగుతోంది. ఈ వార్త తెలుగు సినీ ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. ఈ వార్త బయటకు రావడంతో 'సాహో' యూనిట్ షాక్‌కు గురైందని కూడా టాక్ వినిపిస్తోంది.


యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘సాహో'. సుజిత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా నాలుగు భాషల్లో రూపొందుతోంది. ఈ సినిమాను స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్లు చిత్ర యూనిట్ గతంలో ప్రకటించింది. అయితే, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తవకపోవడం వల్ల ఈ సినిమాను వాయిదా వేశారు. ఈ మధ్య ‘సాహో' కొత్త రిలీజ్‌ డేట్‌ను ఆగస్టు 30కి వాయిదా వేశారు.


‘సాహో' వాయిదా పడుతున్న విషయం నాగార్జునకు ముందే తెలుసంటూ ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం ‘మన్మథుడు 2' విడుదల తేదీని ఆగస్టు 9న ఫిక్స్ చేయడమే. నాగ్ ఈ ప్రకటన చేసే నాటికి ‘సాహో' వాయిదా పడుతున్నట్లు తెలీకపోవడం విశేషం. అప్పుడు నాగ్ ఏ ధైర్యంతో పెద్ద సినిమా ముందు విడుదల చేస్తున్నారన్న చర్చ కూడా నడిచింది.


తన కొత్త సినిమాకు డేట్ ప్రకటించినప్పటి నుంచి ‘సాహో' వాయిదా పడే విషయం నాగార్జునకు తెలుసా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘సాహో' టీమ్‌లో నాగార్జున మనుషులు ఉన్నారంటూ ఓ వార్త బయటకు రావడం చర్చనీయాంశం అవుతోంది. నాగార్జున నటించిన మన్మధుడు సినిమాకి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించాడు. రకుల్ ప్రీత్ నాగార్జునకి జోడీగా నటించింది.



మరింత సమాచారం తెలుసుకోండి: