కింగ్ నాగార్జున హీరోగా రాహుల్ రవింద్రన్ డైరక్షన్ లో వస్తున్న సినిమా మన్మథుడు-2. సూపర్ హిట్ మూవీ మన్మథుడుకి సీక్వల్ గా వస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. చిలసౌ సినిమాతో దర్శకుడిగా సత్తా చాటిన రాహుల్ ప్రతిభ మెచ్చి పెద్ద బాధ్యతనే అప్పగించాడు నాగార్జున.


అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో నిర్మిస్తున్న ఈ సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ కింద కీర్తి సురేష్, సమంతలు కూడా నటిస్తున్నారని తెలిసిందే. ఆగష్టు 9న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా బిజినెస్ విషయంలో కూడా అదరగొడుతుంది. డిజిటల్ రైట్స్ లో ఇప్పటికే మన్మథుడు 2 దూకుడు చూపిస్తుంది.


ప్రముఖ డిజిటల్ మీడియా సంస్థ నెట్ ఫ్లిక్స్ 7.5 కోట్లకు మన్మథుడు-2 డిజిటల్ రైట్స్ దక్కించుకున్నారని తెలుస్తుంది. శాటిలైట్ రైట్స్ రేటు కూడా భారీగానే పలికిందట. నాగార్జున సూపర్ హిట్ సినిమా సీక్వల్ కాబట్టి కచ్చితంగా మన్మథుడు 2 మీద చాలా అంచనాలు ఉన్నాయి.


ఇక ఈ సినిమాతో పాటుగా నాగార్జున బంగార్రాజు సినిమాను లైన్ లో పెట్టాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే మొదలు పెట్టనున్నారట. నాగార్జునతో పాటుగా ఆ సినిమాలో నాగ చైతన్య నటించనున్నాడని తెలుస్తుంది. అక్కినేని ఫ్యామిలీ నుండి వస్తున్న మరో మనం అంటూ బంగార్రాజు సినిమా ప్రచారంలో ఉంది.     



మరింత సమాచారం తెలుసుకోండి: