కియారా అద్వాని... తెలుగులో రామ్ చరణ్ సరసన వినయ విధేయ రామలో చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గోన్న ఈ భామ.. తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. తన  కెరీర్ ఆరంభంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని.. ఒక్క అవ‌కాశం కోసం ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగానని.. అంతేకాదు 'ధోనీ' సినిమా త‌ర్వాత కూడా చాలా సినిమాలకు ఆడిష‌న్‌లు ఇచ్చా.. అయితే 'ల‌స్ట్ స్టోరీస్‌' వెబ్ సిరీస్ త‌ర్వాత ఆ అవ‌స‌రం రాలేద‌ని అంటోంది కియారా. 


 ఇటీవ‌లి ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న కియారా మాట్లాడుతూ.. 'లస్ట్‌ స్టోరీస్‌' వెబ్ సిరీస్ చేయకపోయుంటే తన సినిమా కెరీర్‌లో చాలా అవకాశాలు కోల్పోయేదాన్ని అని పేర్కోంది. ఆమె మాట్లాడుతూ.. తాను కెరీర్ ఆరంభంలో చాల కష్టాలు పడ్డానని,  'ధోనీ' సినిమా త‌ర్వాత కూడా చాలా ఆడిష‌న్‌లలో పాల్గొన్నానని.. ఈ నేపథ్యంలో చాలా ఆఫీసుల చుట్టూ అవకాశాలకోసం తిరిగానని.. 'లస్ట్‌ స్టోరీస్‌' చేయ‌క‌పోతే చాలా న‌ష్ట‌పోయేదాన్ని.. ఈ సందర్బంగా పేర్కోంది.


కియారాకు ఇటీవల విడుదలైన తెలుగు రీమేక్ 'కబీర్ సింగ్‌'తో బాలీవుడ్‌లో ఎన‌లేని గుర్తింపు ల‌భించింది. అంతేకాకుండా న‌టిగా స‌త్తా చాట‌డం, కథ డిమాండ్ మేరకు బోల్డ్‌గా న‌టించ‌డానికి వెనుకాడ‌క‌పోవ‌డం వంటి కార‌ణాల‌తో కియారాకు అవ‌కాశాలు పుష్క‌లంగా వ‌స్తున్నాయి. మరోవైపు వెబ్ సిరీస్‌ల్లోనూ అదరగొడుతోంది. గ‌తేడాది వ‌చ్చిన 'ల‌స్ట్ స్టోరీస్' వెబ్ సిరీస్‌తోనే కియారాకు మంచి గుర్తింపు ల‌భించింది. ఆ సినిమాలో బోల్డ్‌గా న‌టించి యువ‌త‌ను మతులుపోగొట్టేసిన కియారా.. ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంటోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: