త్వరలో టాలీవుడ్ లో మంచి అంచనాలతో విడుదలకు సిద్ధం అవుతున్న సినిమాల్లో రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో, అలానే నాచురల్ స్టార్ నాని నటించిన గ్యాంగ్ లీడర్ కూడా ఉన్నాయి. ఇకపోతే మొదట్లో సాహోను ఆగష్టు 15న స్వతంత్ర దినోత్సవ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ఆ సినిమా యూనిట్, ఫస్ట్ లుక్ టీజర్ తో పాటు ప్రకటించడం జరిగింది. అయితే హఠాత్తుగా తమ సినిమాకు క్వాలిటీ విషయంలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కదల్చుకోలేదని, 

అందుకోసం తమ సినిమాను మరొక 15 రోజులు వాయిదా వేసి ఆగష్టు 30న విడుదల చేస్తున్నట్లు సాహో టీమ్ మొన్న మరొక ప్రకటన విడుదల చేసింది. అయితే ఇప్పుడు ఇదే నాని నటిస్తున్న గ్యాంగ్ లీడర్ సినిమా నిర్మాతల పాలిటి శాపంగా మారింది. వాస్తవానికి గ్యాంగ్ లీడర్ యూనిట్, ఎప్పుడో తమ సినిమాను ఆగష్టు 30న విడుదల చేయాలని నిర్ణయించి, అదే డేట్ ని కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఇప్పుడు ఇలా అర్ధాంతరంగా సాహోను తమ సినిమా విడుదలవుతున్న రోజే రిలీజ్ చేయడం తగదని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు లోలోపల కొంత మధనపడుతున్నట్లు సమాచారం. అయితే ఈ విషయమై రెండు సినిమా నిర్మాతల మధ్య మొన్న రాజీ చర్చలు జరిగాయని, 

ఇక తప్పని పరిస్థితుల్లో చేసేదిలేక గ్యాంగ్ లీడర్ సినిమా నిర్మాతలైన మైత్రి మూవీ మేకర్స్ వారు, తమ సినిమాకు సెప్టెంబర్ రెండవ వారంలో రిలీజ్ చేసేందుకు సంసిద్దమయ్యారట. అయితే ఈ విషయమై ఇప్పటివరకు వారి నుండి ఎటువంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ, ప్రస్తుతం ఈ వార్త మాత్రం ఫిలింనగర్ వర్గాల్లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. మరి ఈ రెండు సినిమాల రిలీజ్ ల విషయమై ఏది నిజమో తెలియాలంటే మాత్రం మరికొద్దిరోజులు వేచి చూడాల్సిందే...!!  


మరింత సమాచారం తెలుసుకోండి: