కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన అనీల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న మూవీ ‘సరిలేరు నీకెవ్వరు’ షూటింగ్ షరవేగంగా జరుగుతుంది.  ఈ మూవీలో ప్రముఖ నటి విజయశాంతి నటిస్తుంది.  ఇప్పటి వరకు రాజకీయాల్లో ఉండి ఆమె వెండి తెరపై కనిపించడంపై అభిమానుల్లో క్యూరియాసిటీ బాగా పెరిగిపోయింది. 

ఈ మూవీలో ఇటు నటన పరంగాను మంచి పేరు తెచ్చుకున్న నిన్నటితరం కథానాయికల్లో 'సంగీత' ఒకరు భాగస్వామి కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.  కృష్ణవంశి దర్శకత్వంలో రవితేజ, శ్రీకాంత్ నటించిన ‘ఖడ్గం’మూవీలో ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ అంటూ సినిమా పిచ్చి అమ్మాయిగా నటించింది సంగీత.  అందువలన ఆమెను 'ఖడ్గం' సంగీతగా పిలుస్తుంటారు. వివాహమైన తరువాత కొంతకాలం పాటు నటనకి దూరమైన ఆమె, ఈ మధ్యనే తమిళంలో రీ ఎంట్రీ ఇచ్చింది. అక్కడ తనకి నచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళుతోంది.

ఆ మద్య కొన్ని ఛానల్స్ లో జడ్జీగా కూడా వచ్చారు సంగీత.  మహేష్ బాబు నటిస్తున్న ఈ మూవీలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం అనిల్ రావిపూడి ఆమెను ఒప్పించినట్టుగా సమాచారం. త్వరలోనే ఆమె షూటింగులో జాయిన్ కానుందని అంటున్నారు. మహేశ్ బాబు - రష్మిక మందన కాంబినేషన్లో రూపొందుతోన్న ఈ మూవీ ఫుల్ లెన్త్ ఎంట్రటైన్ మెంట్ గా ఉండబోతుందట.


మరింత సమాచారం తెలుసుకోండి: