క‌న్న‌డ భామ ర‌ష్మిక మండ‌న్న అతి త‌క్కువ కాలంలోనే మంచి తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకుంది. గీతగోవిందం చిత్రంలో మంచి తెలుగింటి ఆడ‌పిల్ల‌లా న‌టించి మెప్పించింది. ప్ర‌స్తుతం ఈ భామ‌సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తో కలిసి  రెండవ సారి జంటగా ‘డియర్ కామ్రేడ్’తో ఈ నెల 26న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. కాగా రష్మికా మండన్న మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సినిమా గురించి రష్మికా  మాట్లాడుతూ ఓ విలేక‌రి అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానంగా... నాకు విజ‌య్‌కి  మ‌ధ్య ఎటువంటి సంబంధం లేద‌ని మేమిద్ద‌రం కేవ‌లం ఫ్రండ్స్ మాత్ర‌మే అని అన్నారు.

 సినిమా ఇండ‌స్ట్రీలో రెండు సినిమాల్లో న‌టించినంత మాత్రాన అలాంటి  ప్ర‌చారాలు చెయ్య‌డం ఎంత వ‌రకు క‌రెక్ట్ నాకు అవి చూస్తే న‌వ్వు వ‌చ్చింది అని అన్నారు.  అలాగే సినిమా చేసే ఎటువంటి సీన్లు అయినా ద‌ర్శ‌కుడు చెప్పేదే చేస్తామ‌ని అంత‌కు మంచి ఏమీ ఉండ‌ద‌ని క్లారిటీ ఇచ్చింది క‌న్న‌డ భామ‌. 

సినిమాలో సీన్ ప‌రంగా ఎక్క‌డైనా లిప్‌లాక్స్ అవ‌స‌ర‌మైతే  అవి కేవ‌లం న‌ట‌న‌వ‌ర‌కే ఏవీ పెద్ద‌గా ప‌ట్టించుకోను లైట్ తీసుకుంటా క‌థాప‌రంగా ఓ ద‌ర్శ‌కుడు చెప్పింది  చెయ్య‌డ‌మే మా ప‌ని అంత‌కు మించి ఎటువంటి భావొద్వేగాలు మాలో ఉండ‌వు అని అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: