చియాన్ విక్రమ్ అనగానే వెంటనే ‘అపరిచితుడు’ గుర్తుకు వస్తాడు.  శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ అప్పట్లో ఎన్నో సంచలనాలు సృష్టించింది.  ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ అయిన విక్రమ్ తాజాగా విశ్వనటుడు నిర్మాణ సంస్థలో ‘మిస్టర్ కెకె' గా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు.  ఈ మూవీ తమిళంలో 'కదరం కొండన్' అనే పేరుతో  రిలీజ్ అయ్యింది.  ఎన్నో అంచనాల మద్య రిలీజ్ అయిన ఈ మూవీ రెండు భాషల్లో భారీ డిజాస్టర్ అయ్యింది. 

రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో నెగిటీవ్ టాక్ రావడంతో విక్రమ్ అభిమానులు నిరాశ చెందారు.  తెలుగు, తమిళంలో డిజాస్టర్ టాక్ వచ్చిందని బాధపడుతున్న సమయంలో మరో షాక్ తగిలింది. ఇప్పుడు మలేషియా ప్రభుత్వం సినిమాను నిషేధించింది.  ఈ మూవీ ఎక్కువగా మలేషియాలో షూటింగ్ జరుపుకున్నారట...అయితే ఇందులో మలేషియా పోలీసులను దుర్మార్గులుగా చూపించినట్లు వారి ఆరోపణ.

అందుకే ఈ మూవీని అక్కడ పూర్తిగా నిషేదించారట. ఈ విషయాన్ని చిత్ర మలేషియా డిస్ట్రిబ్యూటర్స్ లోటస్ ఫైవ్ స్టార్ సంస్థ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ సినిమాను నటుడు కమల్ హాసన్ నిర్మించాడు. కమల్ చిన్న కూతురు అక్షర హాసన్ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: