తెలుగు బిగ్ బాస్ 3 ఎన్ని వివాదాలు మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. అయితే బిగ్ బాస్ లో హోస్ట్ నాగార్జున నుంచి కంటస్టెంట్ల వరుకు ప్రతి ఒక్కరికి ఒక టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. మొదటి రోజే 'బిగ్ బాస్' కాంటస్టెంట్లకి చిచ్చు పెట్టాడు, దీంతో ఫస్ట్ ఆరు మంది నామినేషన్ కి గురయ్యారు. అందులో జాఫర్, శ్రీముఖి, వరుణ్ సందేశ్, వితిక, రాహుల్, బాబా భాస్కర్ నామినేట్ అయ్యారు. 


నామినేట్ అవ్వగానే శ్రీముఖి హైపర్ యాక్టీవ్ అయ్యింది. ఇప్పుడు నామినెటే అంటే నెక్స్ట్ ఎలిమినేషనే, నెక్స్ట్ మనలో ఒకరిని జైలులో పెడుతారు అంటూ ఆమె మాట్లాడుతూంది. బిగ్ బాస్ సీజన్ 1, 2 కంటే ఇందులో ఎక్కువ ట్విస్టులు ఉంటాయి అని అనుకున్న కానీ 'ఫస్ట్ డే'నే బిగ్ బాస్ ఇంత పెద్ద ట్విస్ట్ ఇస్తారు అని ఊహించలేదు అంటూ మరొకరితో మాట్లాడుతూనే ఉంది. 


బుల్లితెరపై వచ్చే పటాస్ అనే ప్రోగ్రాంలో శ్రీముఖి రవితో కలిసి ఎలా కేకలు పెట్టేదో అచ్చం అలానే బిగ్ బాస్ లో కూడా అరుస్తూనే ఉంది. ఆమె అరుపులు పక్కన ఉన్న కంటస్టెంట్లకు ఇబ్బందిగా కూడా ఉన్నాయి. టిఫిన్ వచ్చిన అరుపే, భోజనం వచ్చిన అరూపే ఇవి పక్కన పెడితే బిగ్ బాస్ మాట్లాడిన హాయ్, హలో అంటూ అరుస్తుంది. ఇవి అన్ని చూస్తున్న నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్ల రూపంలో ఫస్ట్ ఎలిమినేట్ అయ్యేది 'రాములమ్మ'నే అని కామెంట్ చేస్తున్నారు. మరి నెటిజన్లు చెప్పినట్టు నిజంగా ఆమె ఎలిమినేట్ అవుతుందా అనేది తెలియాలంటే రెండొవ వరం వరుకు వెయిట్ చెయ్యాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: