కొన్ని రోజులుగా రానా అనారోగ్యంతో ఉన్నాడు. ఈయన ఆరోగ్యం కోసం పలు దేశాలు తిరిగారు దగ్గుపాటి కుటుంబ సభ్యులు. కొన్ని రోజుల కింద ఈయన చికాగో వెళ్లినట్లు తెలుస్తుంది. చికాగోలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో రానాకు జులై 18న సర్జరీ జరిగిందని తెలుస్తుంది. దీనిపై ఇంకా దగ్గుపాటి కుటుంబం కన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంది.


రానా దగ్గుపాటి అనారోగ్యంపై ఎన్నో రోజుల నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. స్వయంగా రానా కూడా తనకు కంటి ఆపరేషన్ అయిందని ఓ సారి లక్ష్మీ షోలో చెప్పాడు.ఆ తర్వాత కూడా రానా దగ్గుపాటి అనారోగ్యంపై కుటుంబ సభ్యులు కూడా స్పందించారు. అప్పట్లో ఆయన చికిత్స కోసం అమెరికా వెళ్తున్నట్లు కన్ఫర్మ్ చేసాడు రానా తండ్రి సురేష్ బాబు. కానీ అది విషమం మాత్రం కాదని క్లారిటీ ఇచ్చాడు.


ఇప్పుడు మరోసారి ఈయన ఆరోగ్యంపై వార్తలు రావడంతో అభిమానుల్లో కంగారు పెరిగిపోయింది. అయితే ఇప్పుడు కూడా చిన్న సమస్యతోనే ఆయన విదేశాలకు వెళ్లినట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే సర్జరీ కూడా పూర్తైందనే టాక్ రావడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు రానా అభిమానులు. రానా దగ్గుపాటి ప్రస్తుతం విరాట పర్వం సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్. ఇందులో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు రానా. వచ్చీ రాగానే ఈ చిత్రంతోనే బిజీ కానున్నాడు రానా దగ్గుపాటి.


విరాట పర్వంతో పాటు గుణశేఖర్ దర్శకత్వంలో హిరణ్య కశ్యప సినిమాలో కూడా నటిస్తున్నాడు రానా దగ్గుపాటి. ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్‌పైకి రానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: