హీరోయిన్ రష్మిక మందన్న టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా అడుగులు వేస్తున్నది.  ఆమె నటించిన డియర్ కామ్రేడ్ సినిమా రిలీజ్ కు సిద్ధం అవుతున్నది.  ఈనెల 26 వ తేదీన సినిమా రిలీజ్ కాబోతున్నది.  ఈ సినిమా తరువాత మహేష్ సరిలేరు నీకెవ్వరూ మూవీలో జాయిన్ అవుతుంది.  


మహేష్ బాబుతో సినిమా చేయాలని ప్రతి హీరోయిన్ అనుకుంటుంది.  ఆ అవకాశం కొందరికే వస్తుంది.  అలాంటి అవకాశమే ఇప్పుడు రష్మికకు వచ్చింది.  హీరోయిన్ గా తనను తానూ ప్రూవ్ చేసుకుంది.  ఛలో సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక గీతగోవిందం సినిమాతో టాప్ పొజిషన్లోకి వెళ్ళింది.  


ఇప్పుడు విజయ్ తో చేసిన డియర్ కామ్రేడ్ సినిమా రిలీజ్ కు రెడీ అయ్యింది.  మహేష్ తో సరిలేరు నీకెవ్వరూ సినిమా చేస్తున్న ఇంతవరకు మహేష్ బాబును సెట్స్ లో కలుసుకోలేదు.  సినిమా ఓపెనింగ్ సమయంలో మహేష్ బాబు విదేశాల్లో ఉన్నారు.  ఫస్ట్ షెడ్యూల్ లో రష్మిక పాల్గొనలేదు.  త్వరలోనే ఈమె మహేష్ తో సెట్స్ లో కలవబోతున్నది.  


కాశ్మీర్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ కోసం రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.  దీనికోసం కొండారెడ్డి బురుజు, ట్రైన్, విజయశాంతి ఇంటి సెట్ ను వేస్తున్నారు. మహేష్ తో కలిసి ఎలా యాక్ట్ చేయాలా అని టెన్షన్ పడుతుందట రష్మిక.  


మరింత సమాచారం తెలుసుకోండి: