విజయ్ దేవరకొండ నటించిన 'అర్జున్ రెడ్డి' చిత్రం హిందీలోకి 'కబీరు సింగ్' పేరుతో రీమేక్ కాబడి భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.  దీంతో విజయ్ చేసే సినిమాల పట్ల అక్కడి నిర్మాతల్లో గురి ఏర్పడింది.  అందుకే ఆయన తాజా చిత్రం 'డియర్ కామ్రేడ్'ను హిందీలోకి రీమేక్ చేయడానికి ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ముందుకొచ్చారు.  


సినిమాను వీక్షించిన ఆయన 'డియర్ కామ్రేడ్' స్టన్నింగ్, పవర్ఫుల్ లవ్ స్టోరీ అని, భరత్ కమ్మ కొత్త దర్శకుడైన చాలా బాగా డైరెక్ట్ చేశాడని, విజయ్, రష్మిక మందన్నలు గొప్పగా పెర్ఫార్మ్ చేశారని చెబుతూ తన ధర్మ ప్రొడక్షన్స్ సంస్థ చిత్రాన్ని రీమేక్ చేస్తుందని అనౌన్స్ చేశారు.  అయితే దీన్ని భరత్ కమ్మ డైరెక్ట్ చేస్తాడా లేకపోతే మరెవరైనా చేస్తారా అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.  విడుదలకు రెండు రోజుల ముందు కరణ్ జోహార్ లాంటి పెద్ద నిర్మాత, దర్శకుడు పొగడటం సినిమాకు కలిసొచ్చే విషయమే అనాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: