బాహుబలి సిరీస్ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నేషనల్ స్టార్గా ఎదిగాడు. ఆ తర్వాత ప్రభాస్ - సుజిత్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం సాహో. ఈ సినిమాలో బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. హాలీవుడ్ యాక్షన్ ఎంటర్టైనర్ స్టైల్లో రూ.300 కోట్ల భారీ బడ్జెట్గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై లెక్కకు మిక్కిలిగా అంచనాలు ఉన్నాయి.
సాహో విజువల్ వండర్ కావడంతో అభిమానులు దీనికోసం ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఈ సినిమా ఆగష్టు 15కు రిలీజ్ అవుతుందని ఎదురుచూస్తున్న అభిమానులకు షాక్ ఇచ్చి ఆగష్టు 30కి పోస్ట్ పోన్ చేశారు. ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ ప్రతీ రోజు డేట్ చెక్ చేసుకుంటున్నారు. ఈ సినిమాపై ఏ రేంజ్లో అంచనాలు ఉన్నాయో చెప్పక్కర్లేదు. బాలీవుడ్ సైతం ఈ సినిమా క్రేజ్ చూసి భయపడుతోందన్న టాక్ కూడా ఉంది.
ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్లు చూసిన ప్రేక్షకులు భారీ ఆశలు పెట్టుకున్నారు. తెలుగు - తమిళ్ - హిందీ భాషల్లో రిలీజ్ అవుతోన్న ఈ సినిమా క్రేజ్ బాలీవుడ్ సినిమాలు కూడా అందుకోలేని పరిస్థితి. సాహో హిందీ టీజర్కు 1 మిలియన్ లైక్స్ వచ్చాయంటే మామూలు విషయం కాదు. ఇప్పటికే టీజర్లతో భారీ వ్యూలు అందుకున్న సాహో మంచి హైప్ తెచ్చుకుంది. బాలీవుడ్ స్టార్ హీరోలు సైతం సాహో ఎఫెక్ట్ తమపై గట్టిగానే ఉంటుందన్న టెన్షన్తో ఉన్నారట.