ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌మిళ సూప‌ర్ స్టార్ ఎంజి రామ‌చంద్ర‌న్ ను స్పూర్తిగా తీసుకోవాలనీ.. మ‌ళ్ళీ సినిమాలు చేయాల‌నీ.. ప్ర‌ముఖ ర‌చ‌యిత ప‌రుచూరి గోపాల‌క్రిష్ణ అభిప్రాయ ప‌డ్డారు... మ‌ళ్ళీ ఎన్నికలు వ‌చ్చేంత‌వ‌ర‌కూ మేక‌ప్‌కు దూరం కాకుండా, ఒక‌వైపు రాజ‌కీయ కార్య‌క‌లాపాలు చేస్తూనే మ‌రోవైపు సినిమాలు చేయాల‌ని అన్నారు ప‌రుచూరి.. అంతేకాదు ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్ప‌ద‌ల‌చుకున్న‌ది సినిమాల ద్వారా చెప్ప‌వ‌చ్చు...ప్ర‌భావితం చేయ‌వ‌చ్చు.. త‌మిళ‌నాట ఎంజీఆర్ ఇలానే చేసే వార‌ని అన్నారు.. ఒక సాధార‌ణ వ్య‌క్తి ఇంటింటికీ తిరిగి చెప్పే ఒక మాట‌ను... ఒక ఆర్టిస్ట్ ఒక సినిమాలో చెబితే స‌రిపోతుంది... ఇది ఆర్టిస్ట్ చేసుకున్న అద్రుష్టంగా భావించారు.. సామాజిక స‌మ‌స్య‌ల‌పై స్పందించే క‌థాంశాల‌ను ఎంచుకుని, ప్ర‌జ‌ల‌ను ఉత్తేజ‌ప‌రుస్తూ ప‌వ‌న్ సినిమాల‌ను చేస్తే బాగుంటుంద‌ని ప‌రుచూరి గోపాల‌క్రిష్ణ తాజాగా ప‌రుచూరి ప‌లుకుల‌లో ఇలా  అన్నారు...


నిజానికి ఎన్టీఆర్ కూడా రాజకీయాల‌లోకి వ‌చ్చిన త‌రువాత కూడా అనేక సినిమాలు చేసారు... ప‌వ‌న్ మ‌ళ్ళీ సినిమాలు చేయాల‌ని ఎంతో అభిమానులు కోరుకుంటున్నారు...ప‌వ‌ర్ స్టార్ మ‌ళ్ళీ మేక‌ప్ వేసుకోవాలి.. ఫ్యాన్స్ కోరిక తీర్చాలి...


మరింత సమాచారం తెలుసుకోండి: