మెగాస్టార్ చిరంజీవి మేన‌ల్లుడుగా సినీ రంగంలో ఎంట్రీ ఇచ్చిన సాయి ధ‌ర్మ్ తేజ్ త‌న‌కు వ‌చ్చిన మంచి అవ‌కాశాన్ని కాల‌ద‌న్నుకుని ఇప్పుడు బాధ‌ప‌డుతున్నాడు. ప్ర‌స్తుతం వ‌ర‌స ఫ్లాపుల్లో ఉన్న సాయి ధ‌ర్మ్ తేజ్‌కు చిత్రలహరి కాస్త ఊరట ఇచ్చినా తాను అనుకున్న స్థాయిలో హిట్ ఇవ్వ‌లేక‌పోయింది. ఇక‌ తాజాగా మారుతి ద‌ర్వ‌క‌త్వంలో `ప్రతిరోజు పండగే` చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. 


అయితే పూరీ `ఇస్మార్ట్ శంక‌ర్‌` స్టోరీని ఫ‌స్ట్ తేజ్‌కే ఆఫ‌ర్ చేశాడ‌ట‌. కానీ వ‌ర‌స ఫ్లాపుల‌తో ఫామ్‌లో లేని పూరీని త‌క్కువ అంచ‌నా వేసి ఆ సినిమాను రిజ‌క్ట్ చేశాడ‌ట‌. నిజానికి పూరి జగన్నాధ్‌ను  డౌన్ ఫామ్‌లో ఉన్నపుడు అతడిని చాలా మంది తక్కువ అంచనా వేసారు. అయితే వారంద‌రి అంచ‌నాలు ఢీ కొడుతూ ఇస్మార్ట్ శంక‌ర్‌తో మ‌ళ్లీ ప‌ట్టాలెక్కాడు. 


ఇక రామ్ పూరీపై పెట్టుకున్న న‌మ్మ‌కాన్ని ఒమ్ము చేయ‌కుండా ఐదు రోజుల్లో పాతిక కోట్ల షార్‌ను రాబ‌ట్టుకుంది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వ‌డంతో పూరీ ఆనందానికి అవ‌దులు లేదు. అయితే సాయి ధ‌ర్మ్ తేజ్ పూరీని న‌మ్మ‌కుండా, పూరి రిక్వెస్ట్‌ని కూడా లెక్క చేయకుండా రిజ‌క్ట్ చేయ‌డంతో మంచి హిట్ సినిమా వ‌దులుకున్నానే అని ఫీల్ అవుతున్నాడ‌ట‌. అలాగే సినిమా చేసిన.. చేయ‌క‌పోయినా మంచి రిలేషన్‌ మెయింటైన్‌ చేసినట్టయితే మ‌రో సారి అవ‌కాశం వ‌చ్చేద‌ని సాయి ధ‌ర్మ్ తేజ్ బాధ‌ప‌డుతున్నాడ‌ట‌.



మరింత సమాచారం తెలుసుకోండి: