మెగాస్టార్ చిరంజీవి అంటే పూరి జగన్నాథ్ కు ఎనలేని అభిమానం... ఎప్పటికైనా చిరంజీవితో సినిమా డైరక్ట్ చేయలనే తన కోరిక చాలా బలంగా ఉన్నది.. 150 వ సినిమా అవకాశం కూడా వచ్చింది.. కథ కూడా నచ్చింది.. టైటిల్ కూడా ఖరారు అయ్యింది..`ఆటో జానీ` .. అయితే పూరీ చెప్పిన కథలో సెకండ్ ఆఫ్ చిరంజీవికి నచ్చలేదు..దీంతో 150 వసినిమా అవకాశం వివివినాయక్ను వరించింది.. పూరీ తాజా సినిమా `ఇస్మార్ట్ శంకర్`తో భారీ విజయాన్ని అందుకున్నాడు పూరీ జగన్నాథ్..ఈ సందర్భంగా మరోసారి చిరంజీవి సినిమా గురించి ప్రస్తావించినపుడు ఓ ఇంటర్యూలో పూరి ఇలా మాట్లాడాడు.. `` చిరంజీవి 150 వ సినిమా ఎంటర్టైన్మెంట్ రూట్ లో చేద్దామనుకున్నాం.... అయితే ఆయన చివరి నిమిషంలో మనసు మర్చుకుని `కత్తి` రీమేక్ చేయాలని అనుకున్నారు.. చిరంజీవి గారితో సినిమా చేసే అవకాశం ఇప్పటికి నాలుగు సార్లు వచ్చి మిస్ అయ్యింది... అందులో రెండు సార్లు పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి.. ఇప్పటికైనా చిరంజీవి అంగీకరిస్తే అయిదు రోజుల్లో కథ రాసేస్తా...`` అంటూ పూరి జగన్నాథ్ తన మనసులో మాట చెప్పాడు...
మాస్ సినిమాలు డైరక్ట్ చేసే పూరి ఇప్పటికే తెలుగులో అగ్ర హీరోలు అందరితో కలిసి పనిచేసాడు.. చిరంజీవి గారితో మాత్రం చేయలేదు..మంచి జోష్లో ఉన్న పూరిజగన్నాథ్ రానున్న రోజుల్లో చిరంజీవి సినిమాను డైరక్ట్ చేసి తన కలను నిజం చేసుకుంటాడని అశిద్దాం...