ఇస్మార్ట్ శంకర్ హిట్టయిందన్న జోష్లో పూరి జగన్నాథ్ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ అనవసరంగా ట్రోల్కు గురవుతున్నాడు. ఇప్పటికే మహేష్ బాబు పై నెగిటివ్ గా స్పందించి మహేష్ ఫ్యాన్స్ నుంచి సోషల్ మీడియాలో చివాట్లు తింటున్నాడు. ప్లాపుల్లో ఉన్న డైరెక్టర్ కు మహేష్ ఛాన్స్ ఇవ్వడని... హిట్ సినిమాలు ఉన్న డైరెక్టర్లకు మాత్రమే ఛాన్స్ ఇస్తానంటూ మహేష్ పై వేసిన సెటైర్ తో మహేష్ బాబు అభిమానులు పూరిని ఓ రేంజ్ లో టార్గెట్ గా చేసుకుని విమర్శలు చేస్తున్నారు.
ఇక ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై సైతం చేసిన కామెంట్లు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు చిర్రెత్తించేలా ఉన్నాయి. ఎన్టీఆర్ గురించి పూరి మాట్లాడుతూ టెంపర్ టైమ్ లో ఎన్టీఆర్ తో ట్రావెల్ చేశాను. ఆ సినిమా కోసం గోవాలో షూట్ చేశాం. సాయంత్రమైతే మమ్మల్ని కారు ఎక్కించుకునేవాడు. చాలా స్పీడ్ గా వెళ్లేవాడు. ఆ కారులో వెళ్లడం కంటే నడిచి వెళ్లడం బెటర్ అనిపించేంది. అంత ఫాస్ట్ గా వెళ్లేవాడు అని పూరి అన్నాడు.
వెంటనే యాంకర్ అదేంటి ఎన్టీఆర్ ప్రతి సినిమాకు ముందు జాగ్రత్తగా బండి నడపండి, మీ కుటుంబాలు ఎదురు చూస్తుంటాయని సందేశం ఇస్తాడుగా అని ప్రశ్నిస్తే అవన్నీ ఎన్టీఆర్ ఊరికే చెపుతాడే తప్పా వాటిని పాటించడని వెటకారంగా కామెంట్ చేశాడు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ పూరికి కళ్లు నెత్తికెక్కాయని... ఒక్క హిట్ రాగానే ఎగిరెగిరి పడుతున్నాడంటూ సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. పూరి అనవసరంగా ఇలాంటి కామెంట్లు చేసి ఎందుకు వివాదాల్లో చిక్కుకుంటున్నాడో ? ఆయనకే తెలియాలి.