క్రియోటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ తెరకెక్కించిన ఖడ్గం సినిమాలో ఒకే ఒక్క ఛాన్స్ అంటూ అమాయకంగా నటించిన సంగీత ఆ సినిమాలో అద్భుతమైన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత శివపుత్రుడు, పెళ్లయిన కొత్తలో, ఖుషీ ఖుషీగా, సంక్రాంతి లాంటి సినిమాల్లో నటించి, పెళ్లి చేసుకుని, తెలుగు సినిమా ప్రేక్షకులకు దూరమైంది. ఇప్పుడు అదే సంగీత మళ్లీ తెలుగు సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. తమిళ సినిమాల్లో ఆల్రెడీ చాలా యాక్టివ్ గా నటిస్తున్న సంగీత తెలుగు ప్రేక్షకులకు మాత్రమే ఎందుకో దూరమయ్యారు. 

మరీ తనకి నచ్చిన క్యారెక్టర్స్ రాకనో లేక పెళ్ళైన హీరోయిన్స్ అని దర్శకులు అవకాశాలు ఇవ్వలేదో తెలీదు. అయితే ఇప్పుడు సంగీతను ఏరికోరి ఓ మంచి పాత్రకు ఒప్పించి మరీ తెలుగులో రీఎంట్రీ చేయిస్తున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. సూపర్ స్టార్ మహేష్ బాబుతో నిర్మిస్తున్న సరిలేరు నీకెవ్వరూ సినిమాలో సంగీత ఓ కీలకపాత్ర పోషిస్తున్నారు. హీరోయిన్ రష్మిక కాంబినేషన్ లో వుండే కీలకమైన పాత్ర అని లేటెస్ట్ అప్‌డేట్. తెలుగులో ఇప్పటికే ఎంతో అవసరమైన క్యారెక్టర్ ఫిమేల్ ఆర్టిస్టుల కొరత వుందన్న సంగతి తెలిసిందే. అప్పటికి ఎవరో ఒకరు ఎంట్రీ ఇస్తుంటే వరుసబెట్టి అన్ని సినిమాల్లో వాళ్లే కనిపిస్తున్నారు. 

అందువల్ల సంగీతకు ఈ సినిమా మంచి కమ్ బ్యాక్ మూవీ అవుతుందని ఫిల్మ్ నగర్ లో చెప్పుకుంటున్నారట. ఇంతకముందు ఓ షో లో సంగీత మంచి క్యారెక్టర్ వస్తే తెలుగులో మళ్ళీ నటిస్తానని చెప్పింది. అందువల్లే అనిల్ రావిపూడి సంగీతని అప్రోచ్ అయ్యారని తెలుస్తోంది. సంగీతకు మాత్రమేకాదు, విజయశాంతి, బండ్ల గణేష్ లాంటి వాళ్లను కూడా మళ్లీ మొహానికి రంగు వేసుకునేలా చేస్తున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. ఇక సరిలేరు నీకెవ్వరు సినిమాకు అనిల్ సుంకర, దిల్ రాజు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు దాదాపు 100 కోట్ల బడ్జెట్ అవుతోందని టాక్.


మరింత సమాచారం తెలుసుకోండి: