సాహో సినిమా తో టాలీవుడ్ లో కొన్ని సినిమాలకు డేట్ క్లాష్ బాగానే వస్తోంది. వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో  14రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న సినిమా వాల్మీకి. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్టైన సినిమా జగర్తాండకు అఫీషియల్ రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా డేట్ మారిందని లేటెస్ట్ అప్‌డేట్. ఇందుకు కారణం ప్రభాస్. సాహో సినిమా రిలీజ్ డేట్ మారడంతో చేసేది లేక వాల్మీకి డేట్ ను మార్చారట. సాహో ఆగస్టు 15 నుంచి 30కి వాయిదా వేశారు సాహో టీమ్. దాంతో సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో విడుదల చేస్తామని డేట్ ప్రకటించిన వాల్మీకి సినిమాను మరోవారం వెనక్కు జరిపి సెప్టెంబర్ 13కు ఫిక్స్ చేసారు. 

దీంతో సాహో సినిమాకు రెండువారాల గ్యాప్ వస్తుంది. కలెక్షన్ల విషయంలో భారీగా తేడ వచ్చే అవకాశం ఉంది. ఇక ఆగస్టు 30న రావాల్సిన నానీస్ గ్యాంగ్ లీడర్ డేట్ కూడా మారుతుంది. అయితే అది సెప్టెంబర్ 20న లేదా 27న అన్న అప్‌డేట్ ఇంకా చిత్ర యూనిట్ నుండి రావాలి. అక్టోబర్ 2న సైరా సినిమా వుందని ఇప్పటికే జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆ సినిమాకి వారం ముందుగానా? రెండువారాలు ముందుగానా? అన్నది డిస్కషన్ లో వుంది. సెప్టెంబర్ అంటే పరీక్షల సీజన్ కనుక, దసరాకు దగ్గరగా రావడమే బెటర్ అనే ఆలోచనలో నానీ టీమ్ వున్నట్లు తెలుస్తోంది.

సైరాకు వన్ వీక్ ముందుగా వస్తే, సోలోగా వన్ వీక్, దసరా సీజన్ లో సైరాతో కలిపి రెండువారాలు థియేటర్లలో వుంటే సినిమా బడ్జెట్ కు సరిపోతుందని గ్యాంగ్ లీడర్ నిర్మాతలు భావిస్తున్నట్లు ఫ్రెష్ అప్‌డేట్. దీనికి సంబంధించిన అఫీయల్ అనౌన్స్ ఈ నెల 24న టీజర్ తో పాటు డేట్ వస్తుందేమో చూడాలి. మొత్తానికి సాహో తో పాటు మెగాస్టార్ సైరా రిలీజ్ డేట్ మీదే చాలా సినిమాలు ఆధారపడి ఉన్నాయని తెలుస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: