శంకర్‌ దర్శకత్వంలో  కమల్‌ హాసన్ ప్రధాన పాత్రలో భారతీయుడు సీక్వెల్‌ ను  ఘనంగా ప్రారంభించి.. మొదటి షెడ్యూల్ ను పూర్తిచేసే క్రమంలో కొన్ని కారణాల వల్ల  షూటింగ్ కి మధ్యలోనే బ్రేక్ ఇచ్చారు.  ఆ తరువాత  షూటింగ్ ను మళ్లీ  ప్రారంభించాలనుకున్నప్పటికీ..  బడ్జెట్ విషయంలో  శంకర్ కి  లైకా ప్రొడక్షన్స్ సంస్థతో విభేదాలు వచ్చాయి.  మొత్తానికి  లైకా ప్రొడ‌క్ష‌న్స్ ఇచ్చిన బ‌డ్జెట్ ప‌రిమితుల్లోనే,  శంకర్ సినిమా చెయ్యడానికి అంగీకరించి  ఆగష్టులో  షూటింగ్ మొదలుపెట్టడానికి రెడీ అవుతున్నాడు. 


అయితే ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్‌ గా  కాజ‌ల్ అగ‌ర్వాల్ నటిస్తుండగా.. తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం  కాజల్ తో పాటు మ‌రో  హీరోయిన్ కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది.  టాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వ‌ర్య రాజేశ్‌  కూడా భారతీయుడు సీక్వెల్‌ లో  కీల‌క పాత్ర‌ల్లో న‌టించ‌బోతుందట. ఇక టెక్ మాంత్రికుడు శంకర్ ఈ చిత్రాన్ని కూడా తన శైలిలోనే భారీ హంగులతోనే తీర్చిదిద్దనున్నారు. అనిరుద్ రవిచందర్  సంగీతం అందిస్తున్న  ఈ చిత్రాన్ని  లైకా ప్రొడక్షన్స్  అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్ముస్తోంది.  2020లో ఈ సినిమా  విడుదలకానుంది.   


మరింత సమాచారం తెలుసుకోండి: