అమలా పాల్ నటించిన "ఆడై" సినిమా గత శుక్రవారం తమిళంలో విడుదలయింది. ఇదే సినిమా తెలుగులో "ఆమె" పేరుతో విడుదలయింది. కానీ విడుదల రోజు తమిళం, తెలుగులో చాలా చోట్ల ఈ సినిమా మార్నింగ్ షోలు పడలేదు. నిర్మాతకు, ఫైనాన్షియర్లకు మధ్య గొడవల వలన ఈ సినిమా మార్నింగ్ షోలు క్యాన్సిల్ అయ్యాయి. తమిళ డిస్ట్రిబ్యూటర్లు, తెలుగులో ఆమె సినిమా హక్కులు కొనుకున్న తమ్మారెడ్డి భరద్వాజ ముందే నిర్మాతకు డబ్బులు ఇచ్చినప్పటికీ నిర్మాత ఫైనాన్షియర్లకు డబ్బులు చెల్లించకపోవటంతో సమస్య మొదలైంది. 
 
కానీ తన సినిమాకు సమస్య రావటంతో అమలా పాల్ ఈ సినిమాకు తీసుకున్న రెమ్యూనరేషన్ అంతా వెనక్కు ఇచ్చేసింది. రెమ్యూనరేషన్ మాత్రమే కాక తన సొంత డబ్బు కొంత మొత్తాన్ని ఇచ్చి సినిమాకు ఇబ్బందులు లేకుండా చేసింది. ఈ సినిమాలోని పాత్ర కోసం అమలా పాల్ చాలా కష్టపడింది. సినిమాలోని పాత్ర కోసం 20 నిమిషాల పాటు నగ్నంగా నటించింది. సినిమాలో ఎలాంటి అసభ్యత లేకుండా అద్భుతంగా నటించింది అమలాపాల్. 
 
కానీ సినిమా మార్నింగ్ షోలు క్యాన్సిల్ అవ్వటంతో కెలెక్షన్లపై ఆ ప్రభావం పడింది. తెలుగులో గురువారం విడుదలైన ఇస్మార్ట్ శంకర్ సినిమాకు హిట్ టాక్ రావటంతో ఆమె సినిమాను పట్టించుకునే వారే కరువయ్యారు. సినిమాకు క్రిటిక్స్ నుంచి ప్రశంసలొచ్చినా సినిమా చివరికి ఫ్లాప్ అయింది.సినిమా కోసం అమలా పాల్ ఎంతో కష్టపడినప్పటికీ ఈ సినిమా వలన అమలా పాల్ డబ్బు పోయింది అనుకున్న సమయానికి విడుదల కాకపోవడంతో సినిమా ఫ్లాపై అమలా పాల్ నటనకు రావాల్సినంత పేరు కూడా రాలేదు. 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: