బిగ్ బాస్ 3 అట్టహాసంగా, గ్రాండ్ గా మొదలయిన సంగతీ తెలిసిందే. అయితే 100 రోజుల పాటి నిర్విరామంగా జరగనున్న ‘బిగ్ బాస్' షోకు వరుణ్ సందేశ్ ఆయన భార్య వితిక షేరు ఒకేసారి అడుగు పెట్టారు. ప్రారంభోత్సవం రోజు మొదటి 13 మంది కంటెస్టెంట్లను ఒక్కొక్కరిగా పిలిచిన హోస్ట్ నాగార్జున.. చివరి ఇద్దరు అంటే వరుణ్, వితికలను జంటగా ఆహ్వానించాడు. షో చరిత్రలోనే భార్యభర్తలు ఎంటర్ కావడం తొలిసారి అంటూ చెప్పుకొచ్చాడు. 


హౌస్‌లోకి ఎంటరైన తర్వాత వరుణ్ సందేశ్.. వితిక కలిసే ఉండడం కనిపిస్తోంది. ఒకరి బాగోగులు మరొకరు చూసుకోవడం.. మధ్య మధ్యలో బాతాకానీలు పెట్టడం సరిపోతుంది. మిగిలిన హౌస్‌మేట్స్ అందరూ ఒకటి.. మేమిద్దరం మాత్రమే ఒకటి అన్నంతగా ఈ జంట ఉంటోంది. 


వితిక ఎలిమినేషన్‌ జోన్‌లోకి వెళ్లింది ఆ సమయంలో స్లీపింగ్ రూమ్‌లో ఓ బెడ్‌పై మహేష్ విట్ట పడుకున్నాడు. ఇక గదిలో ఎవ్వరూ లేరు. అప్పుడు ముచ్చట్లు పెట్టుకుని భార్యభర్తలు డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుకున్నారు. అంతేకాదు, ఒకరినొకరు గట్టిగా కౌగిలించుకున్నారు. వీరి కౌగిలింతలు బిగ్ బాస్ కెమెరాల్లో స్పష్టంగా కనిపించాయి. అప్పుడు.. కెమెరా ఇటే చూస్తుంది అని వితిక అనడం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: