బిగ్‌బాస్ హౌస్‌లో మూడో రోజు ఆస‌క్తిక‌ర స‌న్నివేశం జ‌రిగింది. ఎలిమినేష‌న్లో ఉన్న శ్రీముఖి తనకు బదులుగా హిమజను రీప్లేస్‌ చేయాలనుకుంటున్నానని తెలిపారు. తనకు ఒక రెడ్‌ మార్క్‌ ఉందని మానిట‌ర్‌గా ఉన్న హేమ వేసిన ఆ రెడ్ మార్క్ వ‌ల్లే తాను హిమ‌జ‌ను రీప్లేస్ చేయాల‌నుకుంటున్న‌ట్టు చెప్పింది. హిమజ తన లైఫ్‌లో అన్నీ లైట్‌గా తీసుకుంటుందని శ్రీముఖి వివరించింది. 


ఉద‌య‌మే ప‌నిచేసిన హిమ‌జ ఆ ప‌నిని హేమ‌కు చెప్పి తానే ప‌ని చేశాన‌న్న ఫీలింగ్‌తో ఉంద‌ని శ్రీముఖి చెప్పింది. ఆ వెంట‌నే శ్రీముఖితో వాగ్వివాదానికి దిగిన హిమ‌జ తన గురించి శ్రీముఖికి ఏం తెలుసని అన్నీ లైట్‌గా తీసుకుంటానని చెప్పిందంటూ కన్నీరు పెట్టుకుంది. శ్రీముఖికి కేవ‌లం తాను కెరీర్ ప‌రంగా మాత్ర‌మే తెలుస‌ని... నా వ్య‌క్తిగ‌తం గురించి ఆమెకు ఎంత మాత్రం తెలియ‌ద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. 


దీనిపై స్పందించిన హిమ‌జ త‌న‌పై ఉన్న రెడ్ మార్క్ తొల‌గించేందుకు ఉదయాన్నే లేచి పని చేశానని, ఆ సమయానికి ఎవరూ నిద్రలేవలేదని.. ఆ విష‌యం హేమ‌కు తెలియాల‌నే తాను చెప్పాన‌ని... ఇందులో తప్పేముందంటూ ప్రశ్నించింది. ఇక ఈ వ్యవహారంలో హేమ తన తుది నిర్ణయాన్ని ప్రకటిస్తూ.. హిమజను నామినేట్‌ చేసి శ్రీముఖిని సేవ్‌ చేసింది.


హేమ శ్రీముఖిని సేవ్ చేయ‌డంతో ఈ విష‌యంలోనే హిమ‌జ‌కు హేమ‌కు కూడా గొడ‌వ జ‌రిగింది. తాను త‌ప్పు చేస్తే జ‌నాలు త‌న‌నే త‌ప్పుప‌డ‌తార‌ని సీరియ‌స్ అవ్వ‌గా అందుకు హిమ‌జ కూడా తాను నింద‌లు అన‌వ‌స‌రంగా ప‌డ‌న‌ని ధీటుగా బ‌దులు ఇచ్చింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: