రానా తన కిడ్నీ ఆపరేషన్ కోసం అమెరికా వెళ్ళాడని గత కొద్ది రోజులుగా వార్తలు గుప్పు మంటున్నా ఈ వార్తల పై సురేశ్ బాబు కుటుంబ సభ్యులు ఎవరూ స్పందించక పోవడం అత్యంత ఆశ్చర్యంగా మారింది. తెలుస్తున్న సమాచారం మేరకు ఒక లేటెస్ట్ న్యూస్ ఛానల్ రానా ఆరోగ్యం పై వివరణ తీసుకోవాలని హీరో వెంకటేష్ తో ఫోన్ ద్వారా ప్రయత్నించినా ఆ ఛానల్ ప్రయత్నాలకు వెంకటేష్ కూడ స్పందించ లేదు అని తెలుస్తోంది. 

ఇక ప్రస్తుతం హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం రెండు రోజుల క్రితం అమెరికాలో రానాకు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఒక నెఫ్రాలజిస్ట్ ఆద్వర్యంలో శస్త్ర చికిత్స జరిగినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ ఆపరేషన్ విజయవంతం అయిందని డాక్టర్లు రెండు రోజుల పరిశీలన తరువాత అమెరికాలో ఉన్న రానా కుటుంబ సభ్యులకు కూడ చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. 

ఇప్పుడు ఈ న్యూస్ అమెరికా నుండి రానా కుటుంబ సభ్యులు ద్వారా హైదరాబాద్ లోని వారి కుటుంబ సన్నిహితులకు అందింది అని అంటున్నారు. అయితే రానాకు ఎవరి కిడ్నీ సూటైంది అన్న విషయమై కూడ స్పష్టత ఇవ్వడం లేదనీ కేవలం రానాకు ఆపరేషన్ విజయవంతంగా పూర్తి అయింది అన్న విషయాలు మాత్రమే తమకు అమెరికాలోని రానా కుటుంబ సభ్యుల నుండి అందుతున్నట్లు ఇక్కడి రానా సన్నిహితులు ఒకరితో ఒకరు తమకు వచ్చిన న్యూస్ ను షేర్ చేసుకుంటున్నట్లు టాక్.

రానా కు ఆపరేషన్ అయిన విషయాన్ని తెలుసుకున్న కొందరు దగ్గుబాటి కుటుంబ సన్నిహితులు అమెరికా వచ్చి రానా ను చూస్తాము అని చెప్పినా సున్నితంగా ఇప్పుడు వద్దు అని చెపుతున్నట్లు సమాచారం. దీనితో రానాకు నిజంగానే ఆపరేషన్ పూర్తి అయిందా ప్రస్తుత అతడి ఆరోగ్య స్థితి ఏమిటి అన్న విషయమై ఎందుకు ఇంత రహస్యం కొనసాగిస్తున్నారో ఇండస్ట్రీలోని చాలామందికి అర్ధం కాని విషయంగా మారింది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: