టాలీవుడ్ లో మహేశ్ తో సినిమా చేయాలని దర్శకులు పోటీ పడుతూంటారు. తమకు అవకాశం ఇస్తాడేమోనని కథలతో  రాసుకుంటూంటారు. మహేశ్ అందరికీ అవకాశం ఇవ్వలేడు. అయితే.. మహేశ్ దర్శకులను వెయిట్ చేయిస్తాడని, ఆ సమయానికి హిట్ ఇచ్చిన దర్శకుడితో సినిమా చేస్తాడని మహేశ్ పై టాక్ ఉంది. గతంలో సుకుమార్, రీసెంట్ గా పూరి. కాంట్రవర్శీలకు దూరంగా ఉండే మహేశ్ ఇలాంటి విషయాలతో తనకు తానే కాంట్రవర్శీల్లో ఇరుక్కుంటున్నాడు.

 

 

మహర్షి ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో పోకిరి వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన పూరి పేరు చెప్పలేదు మహేశ్. అదే ఫంక్షన్ లో.. మూడు నెలలు లేట్ అయితే ఆగలేకపోతున్నారు కొందరు దర్శకులు అంటూ సుకుమార్ నూ అన్నాడు. తాజా ఇంటర్వూలో “హిట్లుంటేనే మహేశ్ తనతో సినిమాలు చేస్తాడు, ఇప్పుడు మహేశ్ చేస్తానన్నా నాకంటూ ఓ కేరక్టర్ ఉంది” అని పూరీ అనేశాడు. తనను పలుమార్లు తిప్పించుకుని అనిల్ కు అవకాశమివ్వడంతో మహేశ్ మీద కోపంతో అల్లు అర్జున్ తో సినిమా ఓకే చేయించుకున్నాడు సుకుమార్. వీటన్నింటికీ మహేశ్ టార్గెట్ అయ్యాడు. ఓ హిట్ సినిమా తీసిన డైరెక్టర్ తో కథ వినిపించుకోవడం, లైన్ లో పెట్టి లేట్ చేయడం మహేశ్ కు అలవాటేనని ఇండస్ట్రీ టాక్. పరశురామ్ నూ వెయిట్ చేయిస్తున్నాడని టాక్.

 

 

ఆమధ్య ఒక్కడు తో హిట్ ఇచ్చిన గుణశేఖర్ తో కూడా వరుసగా అర్జున్, సైనికుడు చేశాడు. ఫ్లాపులు రాగనే ఆ కాంబో ఇక రాలేదు. త్రివిక్రమ్ తో కూడా అంతే. దూకుడు బ్లాక్ బస్టర్ ఇచ్చాడని శీను వైట్లతో ఆగడు చేసేదాకా ఆగలేదు మహేశ్. సినిమా ఫ్లాప్ అయ్యేప్పటికి మళ్లీ అతని మోహం చూడలేదు. ఇవన్నీ జరిగినవే. ఇప్పుడు కొరటాల శివ, వంశీ పైడిపల్లి హిట్లిచ్చారు కాబట్టి వాళ్లు ఫ్లాపులిచ్చే వరకూ మహేశ్ వారిద్దరి పేర్లు జపం చేస్తాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ఇష్యూస్ ఎవరో సృష్టించినవి కావు. మహేశే స్వయంగా ఇమేజ్ డ్యామేజ్ చేసుకుంటున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: