ఊహలు గుస గుసలాడే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రాశీ ఖన్నా ప్రస్తుతం తెలుగులో బిజీగా ఉంది. శ్రీనివాస కళ్యాణం తరువాత ఆమె చేస్తున్న సినిమా "వెంకీ మామా". శ్రీనివాస కళ్యాణం అంతటి విజయం సాధించకపోవడంతో కొంచెం వెనక్ బడింది. అయినా కానీ ఈ అమ్మడికి అవకాశాలు తగ్గట్లేదు. చేతిలో ఉన్న సినిమాలతో పాటు ఇంకా ఆఫర్లు వస్తున్నాయి.


"వెంకీ మామా" సినిమా కోసం రాశి ఖన్నా సన్నబడిందని, పైగా ఈ చిత్రంలో రాశి పోస్తిస్తున్న రోల్ చాలా డిఫరెంట్ అని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న రాశీ ఖన్నా.. వెంకీమామ సినిమాలో తన క్యారెక్టర్ ఎలా ఉంటుందనే విషయం బయట పెట్టింది.


రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్న వెంకీమామ సినిమాలో తాను ఫిలింమేకర్ పాత్ర పోషిస్తున్నాని చెప్పింది. ఈ రోల్ లో తాను చాలా కూల్‌గా, మోడ్రన్ లుక్‌లో కనిపిస్తానని తెలిపింది. తన లుక్ ఎవ్వరూ ఊహించని విధంగా ఉంటుందని, మునుపెన్నడూ చూడని ఈ లుక్ చూసి ప్రేక్షకలోకం సర్‌ప్రైజ్ కావడం ఖాయం అని చెప్పుకొచ్చింది.


రియల్ లైఫ్ మామా అల్లుళ్లు విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగ చైతన్య ఈ సినిమాలో రీల్ లైఫ్ మామ అల్లుళ్లుగా కనిపించనున్నారు. 'వెంకీ మామ'గా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. చిత్రంలో వెంకటేష్ సరసన పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటిస్తుండగా, నాగ చైతన్య సరసన రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, బ్లూ ప్లానెట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా రూపొందిస్తున్న ఈ సినిమాకు డైరెక్టర్ బాబీ (కె ఎస్ రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: