మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాగా రూ.200 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న సినిమా  ‘సైరా నరసింహారెడ్డి`. ద‌స‌రా కానుక‌గా ఆక్టోబ‌ర్ 2న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న ఈ సినిమా స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్క‌నుంది. టాలీవుడ్‌లో ఇప్పుడంతా ఎదురుచూపులు సైరా నర్సింహారెడ్డిపైనే ఉన్నాయి.


మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకొంటున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అటు దక్షిణాది నుంచి ఇటు ఉత్తరాది వరకు స్టార్ యాక్టర్లు భాగం కావడంతో దేశవ్యాప్తంగా సైరాపై దృష్టిపడింది. సైరాను మెగా ప‌వ‌ర్‌స్టార్‌ రామ్ చ‌ర‌ణ్  కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇక ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న సైరా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడెక్ష‌న్ ప‌నుల్లో ఉంది.


ఈ సినిమా చారిత్రక నేపథ్యం ఉన్న చిత్రం కావడంతో విజువల్‌ వండర్‌గా తీర్చిదిద్దేందుకు ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. ఈ సినిమా ఇంకా ప్రోస్ట్ ప్రొడక్షన్‌లో ఉండగానే కలెక్షన్ల పరంగా బ్లాక్‌బస్టర్ అనే టాక్ ప్రచారం అవుతున్నది. అయితే సైరాలో కొన్ని  పోరాట సన్నివేశాలు ఫ్యాన్స్‌కు రోమాలు నిక్కబొడిచేలా చేస్తాయని అంటున్నారు. 


డార్క్ ఎఫెక్ట్‌లో తీసిన ఈ సీన్లు చూస్తుంటే థియేట‌ర్ల‌లో ఫ్యాన్స్‌కు పూన‌కాలే వ‌చ్చేస్తాయ‌ని సినిమాటోగ్రాఫ‌ర్ ర‌త్న‌వేలు చెపుతున్నాడు. న‌య‌న‌తార ప్ర‌ధాన హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమాలో త‌మ‌న్నాతో పాటు అమితాబ్‌, సుదీప్ లాంటి స్టార్లు న‌టిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: