1. ప్రస్తుతం టాలీవుడ్ లో బాగా ఫాం లో ఉన్న హీరోయిన్ అంటే రష్మిక పేరునే చెప్పాలి. తన మొదటి సినిమా ఛలో తర్వాత వరుసగా అవకాశాలను అందుకోవడమే కాదు వరుస హిట్స్ ని అందుకుంటోంది. విజయ్ దేవరకొండ తో నటించిన గీత గోవిందం రష్మికను చాలా పాపులర్ చేసింది. దాంతో విజయ్ తో మరో సారి డియర్ కామ్రేడ్ సినిమాతో జత కట్టిన రష్మిక సూపర్‌‌స్టార్‌ మహేష్‌ బాబు పక్కన నటించే ఛాన్స్ ని దక్కించుకుంది. అనిల్‌ రావిపూడి తెరకెక్కిస్తున్న‘సరిలేరు నీకెవ్వరు’ తో ఫస్ట్ టైమ్‌ ఇటు డైరెక్టర్‌.. అటు రష్మిక కాంబోలో మహేశ్‌తో వస్తున్న సినిమా ఇది. ఇప్పటికే తొలి షెడ్యూల్‌ను కాశ్మీర్‌తో పాటు పలు ప్రాంతాల్లో పూర్తి చేసిన చిత్రబృందం త్వరలోనే సెకండ్ షెడ్యూల్‌ను ప్రారంభించబోతోంది. అయితే ‘డియర్ కామ్రేడ్’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ‘సరిలేరు నీకెవ్వరు’ గురించి ఆసక్తిగా మాట్లాడింది రష్మిక.


ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు చలాకిగా, వెరైటీగా సమాధానమిచ్చి అందరిని షాక్ కి గురి చేసింది. మహేశ్‌తో కలిసి నటించడం లక్‌ లా ఫీలవుతున్నారా..? అని మీడియా వేసిన ప్రశ్నకు చాలా లాజిక్‌గా బదులిస్తూ లక్కీనా..అదేం లేదే.. ఎలాంటి అవకాశాలైనా సరే హార్డ్ వర్క్ చేయడం వల్లే వస్తాయంతే..అంటూ చెప్పుకొచ్చింది. తను ఫుల్‌ హార్డ్‌వర్క్ చెయ్యడం వల్లే మంచి మంచి అవకాశాలు వస్తున్నాయని ఫీల్ అవుతున్నానని రష్మిక చెప్పడం కాస్త ఆశ్చర్యమేసే విషయం.


వాస్తవానికి మహేశ్‌ లాంటి సూపర్ స్టార్‌తో కలిసి నటించే అవకాశం వస్తే చాలు ఏ హీరోయిన్ అయినా చాలా హ్యాపీగా ఫీలవుతారు. ఇక మహేశ్‌తో రొమాన్స్‌ చేసే అవకాశం వచ్చినా.. స్క్రీన్‌ను షేర్ చేసుకునే అవకాశం వచ్చినా నిజంగానే ‘లక్కీ’.. అదృష్టమేనని అభిమానులు చెప్పుకుంటూ ఉంటారు. అంతేకాదు టాలీవుడ్‌ మొదలుకుని బాలీవుడ్ వరకు చాలా మంది టాప్ హీరోయిన్స్ మహేశ్‌తో కలిసి నటించే అవకాశం ఒకే ఒక్కసారి వస్తే చాలని చెప్పడం ఎన్నో సందర్భాలలో చూశాం.. అయితే రష్మిక మాత్రం ఇలా మాట్లాడటంతో అభిమానులు కాస్త షాక్ లో ఉన్నారని తెలుస్తోంది. లాజిక్ గా ఆలోచిస్తే ఎలాగో వరుస హిట్లతో ఊపు మీద ఉందిగా.. ఆ మాత్రం మాట్లాడకపోతే ఎలా అని ఫ్యాన్స్ కాస్త వెటకారంగా కౌంటర్ ఇస్తున్నారట. మరి రష్మిక కి ఎలా రీచ్ అవుతుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: