మెగాస్టార్ చిరంజీవి సైరా త‌ర్వాత త‌న సినిమాని ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌తో చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. కాగా తాజాగా సినీ వ‌ర్గాల స‌మాచారం ప్రకారం ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ అక్టోబ‌ర్ మొద‌టి వారం నుంచి మొద‌లు కానుంద‌ని వ‌రుస‌గా ప‌దిహేను రోజులుపాటు షూట్ చేయ‌నున్నార‌ని తెలుస్తోంది. ఇక డైలాగ్ రైట‌ర్‌గా కెరీర్‌ను మొద‌లుపెట్టి స్టార్ డైరెక‌ట్ర్‌గా ఎదిగిన అతికొద్ది మంది ద‌ర్శ‌కుల్లో కొర‌టాల ఒక‌రు. మంచి సోష‌ల్ మెసేజ్ తో కూడుకున్న క‌థ‌ను రాయ‌డంలో కొర‌టాల‌కి మంచి ప‌ట్టు వుంది. 


చిరంజీవి కోసం కొర‌టాల శివ ఓ సోష‌ల్ మెసేజ్‌తో కూడుకున్న ఓ క‌థ‌ను సిద్ధం చేశార‌ట‌. ఈ సినిమాను వ‌చ్చే ఏడాది ఏప్రిల్ రెండ‌వ వారంలో ఉగాది పండుగ సంద‌ర్భంగా విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్న‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం మెగాస్టార్‌, స్వాతంత్య్ర స‌మ‌ర యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర్సింహారెడ్డి జీవిత‌క‌థ ఆధారంగా తెర‌కెక్కుతున్న సైరా న‌ర్సింహారెడ్డి చిత్రాన్ని పూర్తి చేసే ప‌నిలో ఉన్నారు. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ లో ఉన్న ఈ సినిమా ఆగ‌స్ట్ చివ‌రి వారం క‌ల్లా సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ పూర్తి కానుంది. ద‌స‌రా కానుక‌గా ప్ర‌పంచ‌వ్యాప్తంగా సైరా విడుద‌ల కానుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: