అమ్మ అంటే దైవం..ఆ దేవువు తాను భువిలే ఉండలేనని తనకు బదులుగా బిడ్డల కష్టసుఖాలు పూర్తిగా నీదే బాధ్యత అని అమ్మను సృష్టించారని అంటారు.  ఏది ఏమైనా మనం కన్నులు తెరిచి చూసేది మొట్టమొదలు అమ్మేఅని అందరికీ తెలిసిందే. కన్న బిడ్డల కోసం అవసరమైతే తన ప్రాణత్యాగానికి కూడా వెనుతిరగని మహోన్నతమైన త్యాగమూర్తి అమ్మా. అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే..ఇదంతా ఎందుకు చెబుతున్నానమంటే, సినీ నటుడు రానాకి ఆయన తల్లి మరోసారి జీవితాన్ని ప్రసాదించింది. 

గత కొంతకాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న దగ్గుబాటి రానాకు జరిగిన కిడ్నీ మార్పిడి ఆపరేషన్ విజయవంతం అయింది. రానా తల్లి తన బిడ్డకు కిడ్నీ ఇచ్చేందుకు ముందు రావడంతో ట్రాన్స్ ప్లాంటేషన్ ను వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు.  రానా ఇదే ఆరోగ్య సమస్యపై కొంత కాలంగా  హైదరాబాద్, ముంబైల్లో కిడ్నీ సమస్యకు చికిత్స పొందారు.

అయితే, ఆరోగ్యంలో ఎలాంటి మెరుగుదల కనిపించక పోవడంతో, అమెరికాలో చికిత్స పొందాలని భావించారు. అక్కడ కూడా కిడ్నీ మార్చకుంటే లాభంలేదని తేల్చడంతో కన్న బిడ్డ క్షేమం కోసం రానా తల్లి లక్ష్మి తన కిడ్నీ ఇచ్చేందుకు అంగీకరించారు. తాజాగా రానాకి కిడ్నీని సక్సెస్ ఫుల్ గా మార్చారు. ప్రస్తుతం రానా విశ్రాంతి తీసుకుంటున్నారని తెలుస్తోంది.  తదుపరి ఆయన 'విరాట పర్వం' మూవీలో నటించనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: