సాధారంగా మనం అరటి పండ్లు డజన్ల లేక్కలో కొంటాం. కొంత మంది తమకు అవసరం కొద్దీ ఒకటీ రెండు చాలు అని తీసుకుంటాం, అయితే వీటి రేటు డజను అయితే మహా అంటే వందవరకు ఉంటుంది.  కొన్ని రకాల అరటి పండ్లు కాస్త రేటు ఎక్కువగా ఉంటుంది. ఏది ఏమైనా ఓ బాలీవుడ్ హీరో ఇప్పుడు కేవలం రెండు అరటి పండ్లు తీసుకొని దాని బిల్లు చూసి షాక్ తిన్నాడు.

వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్ నటుడు రాహుల్ బోస్‌ షూటింగ్ నిమిత్తం చండీగఢ్ వెళ్లిన రాహుల్.. అక్కడ ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో బస చేశాడు.   జిమ్‌కు వెళ్లొచ్చి రెండు అరటి పండ్లకు ఆర్డర్ ఇచ్చాడు. పండ్లతోపాటు వచ్చిన బిల్లు చూసి నోరెళ్లబెట్టాడు. వాటిపై ఏకంగా రూ.442.50 బిల్లుండడంతో హీరోగారి మైండ్ బ్లాక్ అయ్యింది. 

అయితే కాసేపటి తర్వాత బిల్లు సంగతి ఏంటా అని పరిశీలించి చూడగా,  సెంట్రల్ జీఎస్టీ కింద రూ.33.75, యూటీ జీఎస్టీ కింద మరో రూ.33.75 వేసి మొత్తం బిల్లును రూ.442.50గా చూపించారు.  దాంతో తాను రెండు అరటిపండ్లు తిన్నానని వాటి రేటు దిమ్మతిరిగేలా ఉందని, అరటిపండ్లు కూడా ఆరోగ్యానికి హానికరమేనని ట్వీట్ చేశాడు రాహుల్ బోస్‌.


మరింత సమాచారం తెలుసుకోండి: