సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన కెరీర్ లో 26వ సినిమాగా భారీ స్థాయిలో రూపొందుతున్న సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా తరువాత మహేష్ బాబు పరశురామ్, సందీప్ రెడ్డి వంగ, వంశీ పైడిపల్లిలలో ఎవరో ఒకరితో సినిమా చేసే అవకాశం కనపడుతోంది. ఇక కొన్నేళ్ల క్రితం నుండి మహేష్ బాబు మరియు రాజమౌళి కాంబినేషన్లో సినిమా రాబోతోంది అనే వార్తలు విపరీతంగా వినపడుతున్నాయి. అయితే వాటిపై ఇటీవల మహేష్ మరియు రాజమౌళి ఇద్దరూ స్పందిస్తూ మా ఇద్దరి కాంబోలో సినిమా తప్పకుండా ఉంటుంది, 

అది కూడా దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పైనే చేస్తాం అంటూ వారిద్దరూ స్పష్టం చేసారు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ వారి కాంబినేషన్లో ఎటువంటి జానర్ సినిమా వస్తే బాగుంటుంది అనే దానిపై నేడు ఒక వార్త పలు మీడియా మాధ్యమాల్లో విపరీతంగా ప్రచారం అవుతోంది. అదేమిటంటే, మహేష్ మరియు రాజమౌళి కాంబోలో రూపొందే సినిమా తప్పకుండా జేమ్స్ బాండ్ తరహా జానర్ లో సాగే సినిమానే అంటున్నాయి కొన్ని సినీ వర్గాలు. అయితే అది కొంతవరకు నిజమే అనడానికి ఇటీవల ఆర్ఆర్ఆర్ మూవీ ప్రెస్ మీట్ లో రాజమౌళి మాట్లాడుతూ, మహేష్ గారి ఒక సినిమా ఆడియో ఫంక్షన్లో నేను, మహేష్ తో ఎటువంటి సినిమా చేస్తే బాగుంటుందో చెప్పండి, 

అల్లూరి సీతారామరాజు వంటి దేశభక్తి సినిమానా లేక జేమ్స్ బాండ్ తరహా సినిమానా అని అబిమానులను అడగ్గా, ఎక్కువగా జేమ్స్ బాండ్ సినిమానే అంటూ వారి నుండి స్పందన రావడం జరిగిందని రాజమౌళి అన్నారు. అంతేకాక మహేష్ కూడా రాజమౌళితో చేసే సినిమాతో తన మార్కెట్ ను దేశవ్యాప్తంగా మరింతగా పెంచుకునేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే రాజమౌళి మహేష్ తో బాండ్ సినిమానే చేస్తారు అనే దానిపై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక న్యూస్ వెలువడనప్పటికీ, అభిమానులు కోరుకుంటున్నట్లు వారిద్దరూ కలిసి బాండ్ సినిమా చేస్తే మాత్రం అది తప్పకుండా మంచి సక్సెస్ సాదిస్తుందని చెప్పవచ్చు.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: