యంగ్ టైగర్ ఎన్టీయార్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఎన్టీయార్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో సినిమా మొదలుకాబోతుంది. ఈ సినిమా డ్యాన్స్ ప్రధానంగా సాగుతోందని తెలుస్తుంది. ఎన్టీయార్ ఈ సినిమాలో డ్యాన్సర్ గా కనిపించబోతున్నాడు మరియు సినిమాలో ఎంటర్టైన్మెంట్ కు లోటు ఉండదని సమాచారం. ప్రస్తుతం కేజీఎఫ్ ఛాప్టర్ 2 పనుల్లో బిజీగా ఉన్న ప్రశాంత్ నీల్ ఎన్టీయార్తో తీయబోయే సినిమా కోసం ఇప్పటికే కథ సిధ్ధం చేసాడట. 
 
తెలుగులో ఉన్న టాలెంటెడ్ డ్యాన్సర్లలో ఎన్టీయార్ ఒకరు. కానీ ఎన్టీయార్లోని డ్యాన్సింగ్ స్కిల్స్ పూర్తిగా ఉపయోగించుకునే సరైన సినిమా ఎన్టీయార్ కెరీర్లో రాలేదు. కానీ ప్రశాంత్ నీల్ సినిమాతో ఆ లోటు తీరబోతుందని తెలుస్తుంది. 2020 ఆగష్ట్ నెల నుండి ఈ సినిమా షూటింగ్ మొదలు కాబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఎన్టీయార్ కాంబినేషన్లో జనతా గ్యారేజ్ అనే బ్లాక్ బస్టర్ మూవీ వచ్చిన విషయం తెలిసిందే. 
 
ఎన్టీయార్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ మూవీలో కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నాడు. ఎన్టీయార్ సరసన అమెరికా కు చెందిన్ ఎమ్మా రాబర్ట్ ను హీరోయిన్ గా ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది. రాజమౌళి, ప్రశాంత్ నీల్ సినిమాల తరువాత ఎన్టీయార్ కొరటాల శివ కాంబినేషన్లో సినిమా రాబోతున్నట్లు సమాచారం. వరుస సినిమాలు ప్లాన్ చేసుకుంటూ ఎన్టీయార్ కెరీర్లో గ్యాప్ రాకుండా జాగ్రత్త పడుతున్నాడు. ఆర్ ఆర్ ఆర్ సినిమాకు ఎన్టీయార్ 40 కోట్ల దాకా పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: