బిగ్ బాస్ సీజన్ 3 మొదలుకావడంతోనే రచ్చ మొదలైంది. ఫస్ట్ డే పరిచయాలతో లాగించేయగా రెండో రోజు మజా మొదలైంది. ఎలిమినేషన్ ప్రక్రియను ఎప్పటిలా కాకుండా కాస్త వినూత్నంగా మొదలుపెట్టిన బిగ్ బాస్.. ఈ వారం ఎలిమినేషన్‌లోకి కంటెస్టెంట్ హేమ సారధ్యంలో ఆరుగురిని పంపించారు. 


అయితే టైటిల్ ఫేవరేట్‌గా బిగ్ బాస్ బరిలోకి దిగిన శ్రీముఖి.. ఎలిమినేషన్‌లోకి రావడంతో అప్పుడే సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. షో మొదలై.. మూడు ఎపిసోడ్‌లు కూడా పూర్తికాకపోగా.. అప్పుడే శ్రీముఖి ఆర్మీ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది. ఆమెపై మీమ్స్‌తో పాటు ఆమెకు సపోర్ట్‌ చేయాలంటూ శ్రీముఖి ఆర్మీ సోషల్ మీడియా యుద్ధం మొదలుపెట్టింది. 


ఇందులో అసలు విషయం ఏంటంటే.. టైటిల్ ఫేవరేట్‌గా ఉన్న శ్రీముఖిని తొలిరోజు ఎలిమినేషన్‌లోకి పంపడం ద్వారా గేమ్‌కి మజా తీసుకువచ్చారు నిర్వాహకులు. వాస్తవానికి ఆమె ఎలిమేషన్‌లోకి వెళ్లిన ఖచ్చితంగా సేఫ్ అవుతుందనేది బిగ్ బాస్‌ ఫాలోవర్స్ ఖచ్చితమైన అంచనా. సో.. శ్రీముఖి ప్రచార ఆర్మీ బెంగపడాల్సిన అవసరం లేదు కాని.. ఇదంతా గేమ్‌‌లో మజా రావడం కోసమే. 


అంతేకాదు.. ఏయ్.. మా శ్రీముఖిని ఎలిమినేట్ చేస్తే బిగ్ బాస్ సెట్‌ను తగలబెట్టేస్తాం అంటూ ఫన్నీగా మీమ్స్ మొదలుపెట్టేశారు. అంతే కాదు.. ఆమె విత్ అవుట్ మేకప్.. గట్టిగా అరవడంపై కూడా మీమ్స్ వస్తున్నాయి. కొంతమందైతే కామెడీకి హద్దులు లేకుండా ‘మా అక్క శ్రీముఖిని ఎలిమినేట్ చేస్తే రాష్ట్రాలు తగలబడితపోయాయ్’ అంటూ వార్నింగ్‌లు కూడా ఇచ్చేస్తున్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: