ఉత్తరాది నుంచి వచ్చిన రాశీ ఖ‌న్నా తెలుగులో ‘ఊహలు గుసగుసలాడె’చిత్రంలో నటించి పేరుతెచ్చుకున్నఈ బ్యూటీ. ఈ మధ్యనే ‘ఇమైకా నొడిగళ్’ చిత్రంతో తమిళ సినిమాకు పరిచయం అయింది.  ప్ర‌స్తుతం బిజీగా ఉన్న హీరోయిన్ల‌లో రాశీఖ‌న్నా కూడా ఒక‌రు. ద్వితీయ శ్రేణిలోని హీరోలతో రాశీకి వరసగా అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం ఈ భామ తెలుగులో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తోన్న ‘ప్రతిరోజూ పండగే’ సినిమాలో నటిస్తోంది. ఇటీవ‌ల వ‌ర‌స సినిమాల‌తో దూసుకుపోతున్న ఆమె క్యారెక్ట‌ర్‌పై గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. 


క్యారెక్ట‌ర్ ఆమె న‌టిస్తోన్న ఓ సినిమాకు సంబంధించిన క్యారెక్ట‌ర్ మాత్ర‌మే షుమా.. ఎంతో ముద్దుగా.. బొద్దుగా ఉండే రాశీ ఇప్పుడు చాలా స‌న్న‌గా మారిపోయింది. దీనిపై టాలీవుడ్‌లో ఎన్నో గుసగుస‌లు వినిపిస్తున్నాయి. అస‌లు విష‌యం ఏంట‌న్న‌ది చూస్తే.. నాగ చైతన్య, వెంకటేష్ ప్రధాన పాత్రలలో బాబీ తెరకెక్కించనున్న చిత్రం వెంకీ మామ‌లో ఆమెకు ఒక ఇంట్ర‌స్టింగ్ రోల్‌లో చేయ‌బోతున్నార‌ట‌.


అయితే గత ఏడాది తొలిప్రేమ వంటి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకులని అలరించిన ఈ అమ్మడు ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఇంత‌కీ వెంకీమామ సినిమాలో ఆ ఇంట్ర‌స్టింగ్ రోల్ ఏంటంటే.. ఫిలింమేకింగ్ పాత్ర పోషించ‌బోతుంద‌ట‌. అందుకే ఆమె స‌న్నగా మారాన‌ని ఆమె చెబుతుంది. వెంకీ మామ సినిమాను ఈ యేడాది చివ‌ర్లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు వ‌చ్చే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ్‌.



మరింత సమాచారం తెలుసుకోండి: