మ‌హేష్‌బాబు యువ‌రాజు సినిమాలో నటించిన సాక్షి శివానంద్‌ను తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేరు. నాగార్జున శివరామరాజు - చిరంజీవి ఇద్ద‌రు మిత్రులు - మోహన్‌బాబు యమజాతకుడు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన సాక్షి తన సొంత చెల్లిని చేసేందుకు ప్లాన్ వేసినట్టు సాక్షి చెల్లి శిల్ప సంచలన ఆరోపణలు చేసింది.


తన అక్క సాక్షి తనను చంపాలని చేస్తోందని శిల్పా శివానంద్‌ ఆరోపించింది శిల్ప. కూడా తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. మంచు విష్ణు డెబ్యూ మూవీ విష్ణు సినిమాలో ఆమె హీరోయిన్ గా నటించింది. తనను చంపేసి తన మీద ఉన్న బీమా సొమ్ము దక్కించుకునేందుకు తన అక్క ప్రయత్నాలు చేస్తోందని శిల్ప చేసిన ఆరోపణలు బాలీవుడ్ లో ప్రకంపనలు రేపుతున్నాయి.


త‌న అక్క అత్త భావ‌న గ‌తంలో ఆమె భ‌ర్త‌ను చంపేసి బీమా క్లైమ్ చేసుకుంద‌ని... ఇప్పుడు బీమా డబ్బు కోసం నన్ను.. నా తల్లిని కూడా చంపాలనుకుంటుందని.. అందుకు తన సోదరి సాయం చేస్తోంద‌ని ఆమె ఆరోపించారు. పోలీసుల‌కు భ‌య‌ప‌డి ఇప్ప‌టికే అక్క అత్త భావ‌న అమెరికాకు పారిపోయింద‌ని... ఆమె ఇండియాకు వ‌చ్చిన వెంట‌నే పోలీసులు అదుపులోకి తీసుకుంటార‌న్నారు.


త‌న బెస్ట్ ఫ్రెండ్‌తోనే త‌న‌పై రేప్ చేయించాల‌ని చూశార‌ని... ఈ విష‌యంలో త‌న‌కు అభిమానులు అంద‌రూ సాయం చేయాల‌ని కోరింది. మ‌రి ఈ విష‌యంలో శిల్ప సోద‌రి సాక్షి శివానంద్ ఎలా రియాక్ట్ అవుతుందో ?  చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: